English | Telugu

అన‌సూయ ఉండ‌గా.. 'జ‌బ‌ర్ద‌స్త్‌'లోకి యాంక‌ర్‌గా ర‌ష్మి ఎలా వ‌చ్చింది?

ఆల్రెడీ 'జ‌బ‌ర్ద‌స్త్‌'కు అన‌సూయ యాంక‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ మ‌రో యాంక‌ర్‌గా ఎలా వ‌చ్చింద‌నేది చాలా మందికి అర్థంకాని విష‌యం. త‌న చాతుర్యంతో ర‌ష్మి ఆ షోకు యాంక‌ర్‌గా వ‌చ్చింద‌నీ, దాంతో అన‌సూయ యాంక‌రింగ్ చేసే దానికి 'జ‌బ‌ర్ద‌స్త్' అని ఉంచి, ర‌ష్మీ యాంక‌రింగ్ చేసే షోకు 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అని పెట్టార‌నీ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌చారం ఉంది. అయితే తాను అన‌సూయ నుంచి ఆ షోను లాక్కోలేద‌ని ర‌ష్మి స్ప‌ష్టం చేసింది.

'జ‌బ‌ర్ద‌స్త్‌'కు యాంక‌రింగ్ చాన్స్ ఆమెకు 2013లో వ‌చ్చింది. "ఆ టైమ్‌లో అన‌సూయ ప్రెగ్నెంట్‌. దానివ‌ల్లే ఆమె ఆ షో నుంచి కొంత‌కాలం బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింది. త‌ప్ప‌నిస‌రిగా ఆమె స్థానంలో యాంక‌ర్‌గా మ‌రొక‌రు కావాలి. అప్పుడు నాకు ఫోన్ వ‌చ్చింది. నిజానికి నేను మా అమ్మ‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డంతో అప్ప‌టికే ఇండ‌స్ట్రీ నుంచి ఓ ఏడాది గ్యాప్ తీసుకున్నాను. అంటే నాక‌స‌లు చేతిలో ప‌నిలేదు. ఇక ఇండ‌స్ట్రీతో నాకు ప‌ని అయిపోయింద‌నే, సినిమాల చాప్ట‌ర్ క్లోజ్ అనే అనుకున్నాను. ఆ ఏడాది గ్యాప్ తీసుకున్న‌ప్పుడు కూడా జ్ఞాపిక ప్రొడ‌క్ష‌న్స్‌ ప్ర‌వీణ గారివ‌ల్ల‌ అప్పుడ‌ప్పుడు టీవీ షోల‌కు గెస్ట్‌గా వ‌స్తుండేదాన్ని." అని ర‌ష్మి ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

ఓరోజు స‌డ‌న్‌గా ఆమెకు కాల్ వ‌చ్చింది. "జ‌బ‌ర్ద‌స్త్ షో ఉంది.. ఎల్లుండి నుంచే షూటింగ్. మీరు రాగ‌లుగుతారా?" అని అడిగారు. అప్ప‌టికి జ‌బ‌ర్ద‌స్త్ షో మొద‌లై 13 ఎపిసోడ్లు మాత్ర‌మే ప్ర‌సార‌మ‌య్యాయి. టీవీ అంటే సినిమాల్లో చేసేవారికి చిన్న‌చూపు ఉన్న‌రోజుల‌వి. "నువ్వు టీవీ షో చేస్తావా? మ‌ళ్లీ నీకు సినిమాలు రావు" అని కొంత‌మంది ర‌ష్మిని డిస్క‌రేజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. "అప్పుడు నా బ్యాంక్ బాలెన్స్ జీరో. చేతిలో ఏ ప‌నీ లేదు. ఏదో ఒక‌టిలే అనుకుని ఆ ఆఫ‌ర్‌ను యాక్సెప్ట్ చేశాను." అని చెప్పింది ర‌ష్మి.

అలా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంతో అన‌సూయ తిరిగి వ‌చ్చినా, మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ ర‌ష్మిని వెన‌క్కి పంప‌లేదు. ఆమెతో షోను కొన‌సాగించి, దానికి 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్' అనే పేరు పెట్టింది. అదీ జ‌బ‌ర్ద‌స్త్‌లోకి ర‌ష్మీ ఎంట్రీ ఇచ్చిన దానికి వెన‌కున్న క‌థ‌.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.