Read more!

English | Telugu

రిషి కోసం వాళ్ళింటికి వెళ్ళిన వసుధార!

'గుప్పెడంత మనసు'  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్. అత్యధిక మంది వీక్షకులను ఆకర్షిస్తోన్న ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-663 లో..  వసుధార కాలేజీలోకి వచ్చి రిషి గురించి జగతిని అడిగి తెలుసుకుంటుంది. 

"రిషి గురించి నీకెందుకు" అని జగతి మేడం కోప్పడుతుంది. "వసు మేడం ఎందుకు వచ్చారు?" అని మహేంద్ర అంటాడు.  అలా అనడంతో వసుధార "సర్.. మీరు నన్ను మేడం అంటున్నారేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది. "మా వసుధార అయితే మేము చెప్పినట్టు వినేది. ఇప్పుడు తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకే  మీకు గౌరవం ఇచ్చే మాట్లాడాలి" అని మహేంద్ర అంటాడు.  "ఇక  సరే మేడం నేను వెళ్తున్నాను. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ గా ఛార్జ్ తీసుకుంటా" అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది వసుధార.

వసుధార తన క్యాబిన్ లో కూర్చుని రిషీకి ఫోన్ చేస్తుంది. ఎన్ని సార్లు ఫోన్ చేసిన రిషి కట్ చేస్తూనే ఉంటాడు. అలా కట్ చేసేసరికి బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి వసుధార దగ్గరికి జగతి, మహేంద్రలు వస్తారు. ఏం  జరిగిందో చెప్పమని ఎంత అడిగినా వసుధార చెప్పకుండా మాట దాటేస్తుంది.

ఆ తర్వాత జగతి ఇంటికి వచ్చేస్తుంది. దేవయానితో  వసుధార వచ్చిన  విషయం చెప్తుంది. "అది మళ్ళీ ఎందుకు వచ్చింది.. ఎవరు రానిచ్చారు" అని దేవయాని కోపంగా అడిగుంది. "వసుధార ఇప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ హెడ్.. అందుకే వచ్చింది" అని చెప్పింది జగతి. అంతలోనే రిషి కోసం వసుధార వస్తుంది.  "రిషి సర్ ఉన్నారా?" అని అడుగుతుంది.  "ఏంటే.. ఇదేదో నీ సొంత అత్తారిల్లు అయినట్టు సరాసరి లోపలికి వచ్చేశావ్" అని దేవయాని కోప్పడుతుంది. "మీరు ఉండండి అక్కయ్య.. తనతో నేను మాట్లాడుతాను" అని జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.