Read more!

English | Telugu

‘దేవత’ సీరియల్ ఫేమ్ వైష్ణవి సీమంతం వేడుకలు

లాస్ట్ ఇయర్ బుల్లితెర మీద చాలా మంది సెలబ్రిటీస్ ఒక్కొక్కరిగా గుడ్ న్యూస్ చెప్పారు. కార్ లు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కుని పాలు పొంగించారు, కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు, కొంత మంది పిల్లలకు జన్మనిచ్చి గుడ్ న్యూస్ చెప్పారు. బుల్లితెర నటిగా ఎంతో ఫేమస్ అయిన వైష్ణవి రామిరెడ్డి అందరికీ తెలుసు. ఒకవేళ వైష్ణవి అంటే తెలియకపోయినా.. దేవత సీరియల్ లో హీరోయిన్ చెల్లి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు.

పెళ్లికి ముందు సీరియల్స్ లో యాక్టివ్ గా ఉండేది.. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది.  దేవత సీరియల్ నుంచి కూడా తప్పుకుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. సీరియల్ నటి వైష్ణవి ప్రతి విషయాన్ని యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

కరీంనగర్ కి చెందిన సీరియల్ డైరెక్టర్ సురేష్ కుమార్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో తాను  తల్లిని కాబోతున్నట్టు చెప్పింది. ఇక  ఇప్పుడు ఆమె సీమంతం జరుపుకుంది. తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రాబోతున్న విషయాన్ని గుర్తుచేస్తూ.. సీమంతం ఫోటోలు పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ  ఫోటోలు  వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ దంపతులకు విషెస్ చెప్తున్నారు.