English | Telugu

నన్ను ఒకవైపే చూశారు.. ఇకపై నేనేంటో చూపిస్తా!

బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన వారిలో అందంతో పేరుతెచ్చుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు. బిగ్ బాస్ సీజన్-6 లో తన అందంతో ఆకట్టుకుంది వాసంతి కృష్ణన్. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండేందుకు‌ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాసంతి కృష్ణన్ ఆ జాబితాలోకి చేరింది. బిగ్ బాస్ లో గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బ్యూటీ వాసంతి కృష్ణన్. బిగ్ బాస్ లో ఎంట్రీతో ఫేమ్ లోకి వచ్చిన ఈ గ్లామర్ క్వీన్, బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంది.

హౌజ్ లో ఉన్నన్ని రోజులు వెనకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఇండివిడ్యువల్ గా ఉన్న వాసంతి. మరో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తను నామినేషన్లో ఉన్నప్పుడు ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌజ్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. ప్రస్తుతం బీబీ జోడీలో అర్జున్ కి జంటగా వాసంతి జత కట్టి అందరిని తన డాన్స్ తో తన వైపుకి తిప్పుకుంది. ప్రస్తుతం వాసంతి వరుస ఆఫర్స్ తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండ పలు టీవీ కార్యక్రమాల్లో కనిపిస్తు ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉంటు వస్తుంది వాసంతి. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. తాజాగా శ్రీసత్యతో, వాసంతి చేసిన డాన్స్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.

తాజాగా వాసంతి ఇన్ స్టాగ్రామ్ లో తనొక ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తున్నట్టు ఆఫీషియల్ గా చెప్పేసింది. " ఇప్పటివరకు నా జీవితాన్ని స్క్రీన్ పైన వన్ సైడ్ చూశారు. ఇకనుండి మై కంప్లీట్ లైఫ్ స్టైల్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించబోతున్నాను. మీరందరి సపోర్ట్ నాకు కావాలి" అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. అసలే గ్లామర్ తో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. మరి ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ ని యూట్యూబ్ ద్వారా పంచుకోవాలనుకున్న వాసంతి.. ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుందో చూడాలి మరి!

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.