English | Telugu

'వైదేహీ పరిణయం' హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఇదే!

అందం, అమాయకత్వం కలగలిపిన అమ్మాయి వైదేహిగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ ఉంది చూశారా? అదేనండీ... 'జీ తెలుగు'లో ప్రసారం అవుతున్న 'వైదేహీ పరిణయం' సీరియల్‌లో వైదేహిగా నటిస్తున్న అమ్మాయి. నటనపై ఆసక్తితో విమానంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ వచ్చింది. ఇంతకీ, యుక్తా మల్నాడ్ ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న యుక్తా మల్నాడ్ తెలుగమ్మాయి కాదు. పేరులోని చివరి అక్షరాలు 'మల్నాడ్' ఆమె ఇంటి పేరు కూడా కాదు. యుక్తాది కర్ణాటకలోని చిక్ మంగళూరు. బీకామ్ చదివింది. డిగ్రీ చదివేటప్పుడు అందాల పోటీల్లో పాల్గొనేది. 2015లో 'మిస్ మల్నాడ్' టైటిల్ గెలుచుకుంది. అందుకు గుర్తుగా పేరు చివర 'మల్నాడ్' అని పెట్టుకుంది.

కాలేజీలో ఉండగా కన్నడ సినిమా 'అనిసుతిదే'లో అవకాశం వస్తే నటించింది. కానీ, అది విడుదల కాలేదు. డిగ్రీ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా చేసే అవకాశం వస్తే 'స్పైస్ జెట్'లో చేరింది. నటనపై ఆసక్తితో రెండు మూడు నెలలు తిరక్కుండా మానేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కొన్నాళ్ళు పని చేసింది. కన్నడ సీరియల్‌లో నటించాలని ఆడిషన్స్ ఇస్తే... తొలుత తమిళ సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అదెలా? అంటే... కన్నడ సీరియల్‌కి పని చేసే వ్యక్తి ఒకరు తమిళంలో చేస్తావా? అని అడగటంతో చేసేసింది. తర్వాత తెలుగులో 'వైదేహీ పరిణయం'లో అవకాశం వచ్చింది.

నిజానికి, తెలుగులో సినిమా కథానాయికగా అడుగుపెట్టాలని యుక్తా మల్నాడ్ భావించింది. తలుపు తట్టిన మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని సీరియల్ చేశానని ఆమె చెప్పింది. అదీ సంగతి.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.