Read more!

English | Telugu

రుద్రాణి చెప్పిన మాస్టర్ ప్లాన్ ఏంటి.. స్వప్నకి మళ్ళీ పెళ్ళిచూపులు!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -82 లో.. కావ్య టీ తీసుకొని వచ్చి అందరికి ఇస్తుంటే.. రాజ్ మాత్రం తీసుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. రాజ్ వెనకాల కావ్య టీ పట్టుకొని వెళ్లి తనకి ఇస్తుంటే.. రాజ్ కోప్పడతాడు. ఇంట్లో అందరిని నీ వైపుకి తిప్పుకుంటున్నావ్.. ఇంట్లో మా అమ్మా గౌరవంగా ఉండేది.. నువ్వు వచ్చాక అది తగ్గిపోతుంది.. మా అమ్మకి నేను కూడా రివర్స్ మాట్లాడుతున్నాను.. ఇదంతా నీ వల్లే.. ఎంత మందిని నీ వైపుకి తిప్పుకున్నా నువ్వు చెప్పిన గడువులోపు ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకుంటేనే ఈ ఇంట్లో ఉంటావు లేకుంటే బయటకు గెంటేస్తానని కావ్యతో రాజ్ అంటాడు. రాజ్ అనే మాటలన్ని మౌనంగా వింటుంది.

మరొకవైపు అప్పు చేసిన ప్లాన్ వర్కౌట్ అయి.. వీధిలోని ఆడవాళ్లు వచ్చి స్వప్నని అవమానిస్తారు.. లేచిపోయి వచ్చినదాన్ని మళ్ళీ ఎందుకు రానిచ్చావంటూ కనకంని అడుగుతారు. పెళ్లి చేసి పంపించేయ్యంటూ సంబంధాల గురించి చెప్తారు. వాళ్ళు మాట్లాడిన మాటలకు బయపడిన స్వప్న.. రాహుల్ తో పెళ్లి గురించి మాట్లాడాలని అనుకుంటుంది. మరొకవైపు కావ్య ఒక్కతే తన గదిలో ఉన్న కృష్ణుడితో.. తన బాధని వెళ్లబుచ్చుకుంటుంది. నన్ను ఒక మనిషిగా చూడని భర్తని ఇచ్చావ్.. నేను ఒక ఆడపిల్లని  గుర్తించని అత్తని ఇచ్చావ్.. నన్ను అర్థం చేసుకొని భర్త ఉంటే.. భార్య సంతోషంగా ఎలా ఉంటుందంటూ కావ్య బాధపడుతుంది. అవన్నీ మాటలు ఇందిరాదేవి విని.. సీతరామయ్య దగ్గరికి వెళ్లి కావ్య, రాజ్ ల మధ్య సక్యత లేదని అనగానే రుద్రాణి వచ్చి వాళ్ళిద్దరిని దగ్గర చెయ్యాలంటే ఒక ప్లాన్ ఉందని ఆ ప్లాన్ గురించి వాళ్ళకి చెప్తుంది. ప్లాన్ బాగుందని రాజ్ నానమ్మ తాతయ్య అనుకుంటారు. కాసేపటికి ఒంటరిగా తన కూతురి రేఖ దగ్గరికి వెళ్ళిన ఇంద్రాణి.. ఈ విషయమంతా చెప్తుంది. భార్యా, భర్తలని దగ్గర చేసి తల్లి కొడుకులను వేరు చేస్తున్నాను. దీనివల్ల రాజ్, అపర్ణల మధ్య గొడవ ఏర్పడుతుందని రుద్రాణి అంటుంది. మరొకవైపు స్వప్నకి పెళ్లి చూపులు ఆరెంజ్ చేస్తుంది అప్పు. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి.. అప్పు, కనకంలకి నచ్చుతాడు. కానీ స్వప్న అతడిని చిరాకుగా చూస్తుంది. నేను వీన్నీ చేసుకోవాలా అని స్వప్న అనగానే.. నేను లేచిపోయి వచ్చినదాన్ని పెళ్లి చేసుకోవాలా అని నేను అనగలనని పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి అంటాడు. స్వప్న పెళ్లి మీతోనే చేస్తానని అప్పు ఆ అబ్బాయికి చెప్తుంది.

మరొకవైపు దుగ్గిరాల ఇంటికి పంతులు వచ్చి.. రాజ్, కావ్య ల జాతకం చూస్తాడు. ఎందుకు వీళ్ళకి ఒకరంటే ఒకరికి పడడం లేదని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి వాళ్ళకి చెప్పిన ప్లాన్ ఏంటి? సీతరామయ్య, ఇందిరాదేవిలు ఏం చేస్తారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.