Read more!

English | Telugu

ఆకలితో ఉన్న కృష్ణకి పండ్లు ఇచ్చిన రేవతి!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -143 లో.. కృష్ణ, మురారిలు తినడానికి భోజనం ఏమీ మిగల్చకుండా చేస్తుంది భవాని. అలా ఇంట్లో వాళ్ళు కఠినంగా ప్రవర్తించడంతో కృష్ణ, మురారి లు బాధపడుతు గదిలోకి వెళ్తారు.. నీకు ఆకలిగా ఉందా కృష్ణ అని మురారి అడుగుతాడు.. లేదు ఏసీపీ సర్ అని కృష్ణ అంటుంది. చిన్నప్పుడు అమ్మపై అలిగి అన్నం విసిరేయ్యడం... కూరలు బాలేవంటూ అనడం చేసినందుకు.. నాకు దేవుడు ఇలా ఆకలితో ఉండమని శిక్ష వేసాడెమో అని కృష్ణ అంటుంది. బయటకి వెళ్ళి తిని వద్దాం పదా కృష్ణ అని మురారి అనగానే.. వద్దు ఏసీపీ సర్ మనం చేసిన తప్పు మనకు తెలిసి రావాలని పెద్ద అత్తయ్య ఇలా శిక్ష వేస్తే.. మనం బయట తినివస్తే దాన్ని లెక్క చెయ్యనివాళ్ళం అవుతామని కృష్ణ అంటుంది.. ఒక దేవత వచ్చి మనకు పండ్లు ఇస్తే బాగుండని కృష్ణ అనగానే... రేవతి డోర్ కొట్టి.. ఏం మాట్లాడకుండా మురారికి పండ్లు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మురారి ఆ పండ్లని తీసుకొని వచ్చి.. కృష్ణకి ఇవ్వగానే ఎవరు ఇచ్చారని అడుగుతుంది. ఆ దేవతే వచ్చి ఇచ్చింది.. మా అమ్మ తీసుకొచ్చిందని కృష్ణతో మురారి చెప్తాడు.

మరొకవైపు మురారితో మాట్లాడట్లేదని  ముకుంద బాధ పడుతుంది. ఏ ప్రేమ లేని మీరు ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు.. కొండంత ప్రేమతో ఉన్న నేను మురారికి  దూరంగా ఉన్నానని ముకుంద అనుకుంటుంది. ఆ తర్వాత ఉదయం కృష్ణ లేచి.. తల స్నానం చేసొచ్చి మురారిని నిద్ర లేపుతుంది. కృష్ణ తల దువ్వుకుంటుండగా.. సర్ తల దువ్వుతారా అని కృష్ణ అనగానే.. మొత్తం జుట్టు పీకేస్తానని మురారి అంటాడు. అలా మురారి అనేసరికి కృష్ణ సరదాగా మురారిని కొడుతూ.. తనపై పడిపోతుంది. కాసేపు ఇద్దరు ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటారు. ఆ తర్వాత రేవతి దగ్గరికి కృష్ణ వస్తుంది. ఇద్దరు ఎవరికీ తెలియకుండా మాట్లాడుకుంటారు. నువ్వు అనుకున్నది సాధించావ్.. పెళ్లి చేస్తానన్నావ్.. చేసావని రేవతి అంటుంది. అవును అత్తయ్య.. నాక్కూడా హ్యాపీగా ఉందని కృష్ణ అంటుంది. మీ ఇద్దరు మామయ్యలు గూఢచారుల్లా చూస్తున్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని రేవతి అంటుంది. ఇంతలో భవాని వచ్చి.‌. రేవతి ఏం చేస్తున్నావని అంటుంది. మీరు చెప్పిందే చేస్తున్నా అక్క.. ఇడ్లీ, దోస, చట్నీ చేస్తున్నా అంటూ ఫన్నీ గా సమాధానం చెప్పడంతో.. అది కాదు మనం వెలివేసిన మనిషితో ఎందుకు మాట్లాడావని భవాని అడుగుతుంది. నేను మాట్లాడలేదని రేవతి అంటుంది.. నువ్వు మాట్లాడావని ఈశ్వర్ అంటాడు. 

నేను నీతో మాట్లాడానా అని కృష్ణని రేవతి  అడుగుతుంది.. లేదు అత్తయ్య మాట్లాడలేదని కృష్ణ అనగానే.. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా అని భవాని అంటుంది. అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ కలిసి కృష్ణతో మాట్లాడతారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాల్సిందే.