Read more!

English | Telugu

చేపను రుద్దినట్టు రుద్దేస్తా...జాగ్రత్త ఆది


ఢీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో మొత్తం ఆది వేసిన కుళ్ళు డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఐతే ఈ వారం హైపర్ ఆది ఢీ స్టేజి మీద కూరగాయలమ్మేవాడి వేషంతో వచ్చాడు. "మన దగ్గరకు ఎక్కువగా రెగ్యులర్ కస్టమర్ ఎవరో తెలుసా" అన్నాడు. "ఎవరు వస్తుంటారు  " అని హోస్ట్ నందు అడిగాడు. "శేఖర్ మాష్టర్.. రోజుకు 10 , 12 కట్టల మునక్కాడలు లేకపోతే వెళ్ళడు.. మూడు రోజుల్లో మునక్కాయ తోటే పోయింది మాది" అని చెప్పాడు దానికి శేఖర్ మాష్టర్ తెగ సిగ్గుపడిపోతూ నవ్వేసాడు. తర్వాత సునంద చేపలమ్ముతూ స్టేజి మీద కనిపించింది..ఆమెను చూసేసరికి "దరిద్రమైన వాసనయ్యా బాబు" అన్నాడు ఆది. "చేపలమ్ముకునేవాళ్ళ దగ్గర చేపల వాసన రాకపోతే ఇంకేం వస్తుంది" అని అడిగింది సునంద. "చేపలు అప్పటి నుంచీ ఉన్నాయి అదేం పర్లేదు. కానీ నువ్వొచ్చిన దగ్గర నుంచే" అంటూ సునంద మీద కుళ్ళు జోక్  పేల్చాడు. సునంద ముందు నవ్వుతున్నట్టే కనిపించింది కానీ తర్వాత గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది.

"ఆది ఎక్కువ చేశావంటే చేపను రాయికేసి రుద్దినట్టు నిన్ను రుద్దుతాను" అనేసింది. ఇక ఆది ఊరుకుంటాడా "లాస్ట్ ఎపిసోడ్ కొంచెం అటుఇటు అయ్యుంటే నిజంగానే చేపలు రుద్దుకునేదానివి" అని లాస్ట్ ఎపిసోడ్ లో జరిగిన గలాటాను ప్రస్తావనకు తెచ్చాడు. ఐతే లాస్ట్ ఎపిసోడ్ లో సునంద, సాత్విక్ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు రాకీ చేసిన ఫేక్ ఎలిమినేషన్ కి సాత్విక్ ని, రాకీని ఎలిమినేటి చేసాడు జానీ మాస్టర్. ఏమయ్యిందో ఏమో కానీ ఈ వారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్ రాకీ సెట్ లో కనిపించాడు.