Read more!

English | Telugu

భూలోకంలో నాన్న, యమలోకంలో నానా బూతులు...


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ మొత్తం యమలోకం కాన్సెప్ట్ తో నిర్వహించారు. పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడిగా తాగుబోతు రమేష్ నటించారు. ఐతే చిత్రగుప్తుడు వేషాన్ని చూసి కూడా చిత్రుగుప్తుడు కాదు అనే  డౌట్ వస్తోందంటూ ఆటో రామ్ ప్రసాద్ అనేసరికి "ఐతే నువ్వు చేసిన పాపాలను ఈ భవిష్య వాణి పుస్తకంలో ఉన్నాయి చూపించనా" అని తాగుబోతు రమేష్ బెదిరించేసరికి "వద్దొద్దు" అని కంగారు పడ్డారు రాంప్రసాద్.

ఆ భవిష్యవాణిని తర్వాత ఆటో రాంప్రసాద్ చూసి 'మనకు ఇంకా ఆయుష్షు ఉంది ఐనా సరే పైకి తీసుకొచ్చేసాడు" అని రామ్ ప్రసాద్ నూకరాజుతో చెప్పేసరికి "వీ వాంట్ పెద్దాయన" అంటూ యమధర్మ రాజును పిలవాలంటూ గట్టిగా అరిచాడు . "ఆయన రావడానికి రెండు గంటలు సమయం  పడుతుంది" అని రమేష్ అనేసరికి "రెండు గంటలు వెయిటింగ్ అంటే మాకు బోర్ కొడుతోంది" అన్నాడు రాంప్రసాద్. వెంటనే మంత్రం వేసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళను పిలిచాడు రమేష్. ఇక రష్మీ, ఇంద్రజ యమలోకానికి వచ్చేసారు. ఆటో రాంప్రసాద్ ఇంద్రజను చూసి "మీకు ఇంకా ఆయుష్షు ఉంది. ఐనా కూడా ప్రాణం తీసేసి మిమ్మల్ని ఇలా యమలోకానికి తీసుకొచ్చింది ఇతనే" అని రమేష్ ని చూపించేసరికి "చూస్తే దున్నపోతులా ఉన్నావు, గాడిదలా వయసొచ్చింది, ఎద్దులా కనబడుతున్నావు" అని ఇంద్రజ రెచ్చిపోయి మరి రమేష్ ని తిట్టేసింది. ఇక రష్మీ "భూలోకంలో ఐతే నాన్న , యమలోకానికి వచ్చేసరికి నానా బూతులా" అంటూ షాకయ్యింది. "ప్రాణం పోయిన తర్వాత నాన్నెంటి, అమ్మేంటి  రష్మీ" అని పాపం ఏడుస్తూ చెప్పింది ఇంద్రజ. ఫైనల్ ఓటు గురించి ఓటు విలువ, ఓటు వేయని వారి గురించి ఒక స్కిట్ లాంటి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో చేసి చూపించారు కొంతమంది ఆర్టిస్టులు.