English | Telugu

అవకాశాల కోసం..!

ఈ మధ్యకాలంలో సినిమాలతో పాటు టీవీ కంటెంట్ కు కూడా క్రేజ్ పెరుగుతోంది. అందుకే టీవీ యాంకర్స్ తో పాటు ప్రోగ్రాంలో పాల్గొనే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా లేడీ యాంకర్స్ పాపులారిటీ పెరిగిపోతుంది. పద్దతిగా ఉండేవారి కంటే హాట్ షో చేసేవారికి మంచి గుర్తింపు దక్కుతోంది. ఇప్పటికే అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి ఈ రంగంలో సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు యాంకర్ కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.

రీసెంట్ గా మొదలైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా టాలెంటెడ్ వ్యక్తులను గుర్తించి ఈ షోలో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఆ ప్రదర్శనలతో పాటు సుడిగాలి సుధీర్ సహా 'జబర్దస్త్' టీమ్ సభ్యులు పాల్గొంటూ కామెడీ పంచుతున్నారు. వీరితో పాటు కొందరు అందమైన అమ్మాయిలను కూడా ఈ షోలోకి తీసుకొస్తున్నారు. అలా వచ్చిన వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు.

సోషల్ మీడియాలో ఈమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలో ఈమె చాలా సార్లు కనిపించింది. ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానెల్స్ కి యాంకర్ గా పని చేసిన ఈమె మరిన్ని అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. లేస్ తో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని మిర్రర్ ముందు నుంచొని ఆమె ఇచ్చిన ఫోజులకు యూత్ ఫిదా అయిపోయింది. సినిమా అవ‌కాశాల కోస‌మే ఆమె ఈ హాట్ పోజులిచ్చిందంటున్నారు నెటిజ‌న్లు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.