English | Telugu

''బాటిల్ మొత్తం తాగాక ఒంటరిగా ఫీల్ అవుతానేమో"!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన తల్లితో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. రీసెంట్ గా ఈ తల్లీకూతుళ్లు చీరలు కట్టుకొని చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో సుప్రీత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అంతే రేంజ్‌లో ట్రోలింగ్‌కి గురవుతుంటుంది.

ట్రోలర్స్‌పై ఆమె మండిపడే తీరు కూడా వివాదాలకు దారి తీస్తుంటుంది. రీసెంట్ గానే సుప్రీత లైవ్‌లో ఓ నెటిజన్‌కు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా సుప్రీత మరోసారి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. తన గురించి ఎవరేం అనుకుంటున్నారో చెప్పమని సుప్రీత ఓ పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు .

కొందరు సుప్రీత వ్యక్తిత్వం మీద ప్రశ్నలు అడిగితే.. మరికొందరు మాత్రం పర్సనల్ విషయాల మీదే దృష్టి పెట్టారు. ఓ నెటిజన్ మాత్రం సుప్రీతను తాగుడు అలవాటు ఉందా..? అని నేరుగా అడిగాడు. "మీరు ఓ సిప్ తాగాక ఒంటరిగా ఫీల్ అవుతారా..?" అని సుప్రీతను అడగగా.. దానికి ఆమె. ''బహుశా మొత్తం బాటిల్ తాగాక అలా ఒంటరిగా ఫీల్ అవుతానేమో'' అని చెప్పుకొచ్చింది. వైన్ గ్లాస్‌ను కూడా ఆమె షేర్ చేసింది. మొత్తానికి తనకు వైన్ తాగే అలవాటు ఉందని.. సుప్రీత నేరుగా చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.