English | Telugu

సొహేల్‌-అరియానా రొమాన్స్‌.. చూడాలి అవినాష్ ఫేస్‌!

జ‌బ‌ర్ద‌స్త్ మాజీ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్నవ‌రుస షోల‌ల్లో క‌నిపిస్తూ ర‌చ్చ చేస్తున్నాడు. అయితే అవినాష్ పూర్తి స్థాయిలో ఆక‌ట్టుకుంటుంన్న కామెడీ షో 'కామెడీ స్టార్స్‌'. ఈ షోకి వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, జ‌డ్జెస్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌, న‌టి శ్రీ‌దేవి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ఆదివారం ఈ షోలోకి స్పెష‌ల్ గెస్ట్‌గా బిగ్ ‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ సొహేల్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

సొహేల్ హీరోగా, అరియానా హీరోయిన్‌గా అవినాష్ 'క‌థ వేరుంట‌ది' పేరుతో సినిమా చేస్తానంటూ చేసే స్కిట్‌ న‌వ్వులు పూయించేలా వుంది. అరియానా హీరోయిన్ అన‌గానే చ‌ల్ న‌డువ్ అనడం.. వెంట‌నే త‌న‌ని కూల్ చేయ‌డం కోసం "ఏయ్ సింగ‌రేణి ముద్దు బిడ్డా క‌థ వేరుంట‌ది".. అంటూ అవినాష్ కూల్ చేయ‌డం.. "అగ్గిపుల్ల‌ లాంటి ఆడ‌పిల్ల నేనూ".. అంటూ ఇంత‌లో అరియానా ఎంట్రీ.. వెంట‌నే అవినాష్ "ఇదేంట్రా అగ్గిపుల్ల అంటే నిజంగానే అగ్గిపుల్లొచ్చింది".. అన‌డం... ఆ త‌రువాత బిగ్‌ బాస్ హౌస్ త‌రహాలో సొహేల్‌‌, అరియానాల మ‌ధ్య వాడీ వేడీ ర‌చ్చ జ‌ర‌గ‌డం.. మ‌ధ్య‌లో ఇద్ద‌రిని కూల్ చేయ‌డానికి అవినాష్ ఎంట్రీ ఇస్తే అత‌న్ని ప‌క్క‌కు తోసేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది.

క‌ట్ చేస్తే సొహేల్‌‌, అరియానా "జ‌న‌వ‌రి మాసం"... అంటూ పాటేసుకోవ‌డం.. ఇద్ద‌రూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్లిపోయి స్టెప్పులేస్తుండ‌టంతో అవినాష్ ఫేస్‌లో ఎక్స్‌ప్రెష‌న్స్ మారిపోవ‌డం.. అది గ‌మ‌నించి సొహేల్ "అవినాష్‌కి కాలుతోంది" అంటూ డ్యాన్స్ ఆపేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.