English | Telugu

మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ నాశనం చేసే మంచి మిత్రుడిని ఎంచుకోకు...గీతోపదేశం

మనం కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని భావాలు ఆటోమేటిక్ గా మనసులో వచ్చేస్తూ ఉంటాయి...రీసెంట్ గా గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. "మనం డిప్రెషన్ లో ఉన్నపుడు కానీ, బాధపడినప్పుడు కానీ ఎదురు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ద్రుష్టి మన మీద ఉండాలని..మనల్ని వాళ్ళు చూడాలని విపరీతమైన తాపత్రయపడిపోతూ ఉంటాం.. కానీ వేరే మనిషి కోసం పడే ఆ తాపత్రయమే మనకు మన జీవన విధానానికి, మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది..అదొక ట్రాప్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం...కాబట్టి మనం చివరి శ్వాస విడిచేటప్పుడైనా కానీ జాగ్రత్తగా మనిషిని ఎంచుకోవాలి...మనం మన డిప్రెషన్ హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా ఉండాలి.

అంటే మనల్ని మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ మనల్ని నాశనం చేసే మంచి మిత్రుడిని మాత్రం ఎంపిక చేసుకోకూడదు" అని చెప్పింది." అలాగే ఈ మధ్య కాలంలో ఏ పోస్ట్ పెట్టినా అది తమ కోసమే అన్నట్టు అన్వయించేసుకుంటారని భయపడిపోయిన గీతామాధురి ఇలా కూడా పెట్టింది. "ఎవరిని, దేనికి ఉద్దేశించింది కాదు..కొన్ని సోషల్ గ్యాదరింగ్స్ ని చూసినప్పుడు వచ్చిన ఆలోచన మాత్రమే" అంటూ రాండమ్ థాట్స్ హ్యాష్ టాగ్ ని జత చేసింది. ఇక నెటిజన్స్ ఐతే గీత చెప్పిన ఈ ఉపదేశాన్ని నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ అభినందిస్తున్నారు.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.