English | Telugu

Illu illalu pillalu : అమూల్యతో ప్రేమగా మాట్లాడిన రామరాజు.. మాట వింటుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -373 లో... ప్రేమ గ్లాస్ తో ఒక గేమ్ ఆడుతుంటే.. ధీరజ్ వచ్చి తనని ఆటపట్టిస్తాడు. దమ్ముంటే నాతో ఆడి గెలవరా అని ప్రేమ అంటుంది. ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ కాదని ధీరజ్ అంటాడు. సరే రా నీ చెయ్ కి నా చెయ్ టచ్ అయితే నేనే విన్.. నా చెయ్ కి నీ చెయ్ టచ్ అయితే నువ్వు విన్ అని ప్రేమ అంటుంది.

ఒక సర్కిల్ గీస్తుంది. అందులో ఇద్దరు నిల్చుంటారు. ధీరజ్ ని ప్రేమ కొట్టి వెళ్లిపోతుంటే ధీరజ్ తనని పట్టుకుంటాడు. తనకి దగ్గరగా వెళ్లి రొమాంటిక్ గా చూస్తాడు. అప్పుడే తిరుపతి వచ్చి.. ఇక్కడ పెళ్లి కానీ వాళ్ళున్నారు డోర్ వేసుకోవచ్చుగా అని అంటాడు. మరొకవైపు అమూల్యకి విశ్వ ఫోన్ చేసి.. నువ్వు లేకుండా నేను ఉండలేనని అంటాడు. రేపు నాతో వచ్చేయ్ లేచిపోయి పెళ్లి చేసుకుందామని అంటాడు. అప్పుడే వేదవతి పిలుస్తుంటే అమూల్య ఫోన్ కట్ చేస్తుంది. వేదవతి వచ్చేవరకు రింగ్ కింద పడి ఉంటుంది. అదేంటని వేదవతి అనగానే జారిపోయిందని తీసుకుంటుంది. భోజనం చేద్దాంరా అని వేదవతి అనగానే నాకు ఆకలిగా లేదని అమూల్య చెప్తుంది. అదే విషయం వేదవతి వెళ్లి రామరాజుకి చెప్తుంది.

రామరాజు భోజనం తీసుకొని వచ్చి అమూల్యకి తినిపిస్తూ.. నువ్వు మా అమ్మవి.. మా అమ్మ నన్ను మోసం చెయ్యదంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. కాసేపటికి రామారాజు భుజంపై అమూల్య తలవాల్చి ఏడుస్తుంది. అదంతా ప్రేమ, నర్మద చూస్తారు. ఆ తర్వాత అమూల్య ఒంటరిగా బయట కూర్చొని ఉంటుంది. తన చుట్టూ ముగ్గురు అన్నలు వదినలు కూర్చుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.