English | Telugu

క్యూట్ పోజుల‌తో రచ్చ చేస్తోన్న రష్మీ!

'జబర్దస్త్', 'ఎక్ట్రా జబర్దస్త్' షోల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రష్మీ గౌతమ్. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ సినిమా ఆఫర్లు కూడా అందిపుచ్చుకుంటోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా తన సత్తా చాటుతోన్న రష్మీ.. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

తాజాగా బ్లాక్ డ్రెస్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అతి తక్కువ సమయంలో ఈ ఫోటోలకు లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో అమ్మడు క్యూట్ పోజుల‌తో, కొద్దిపాటి క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా అందంగా ఉన్నావని.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఓపక్క 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' షోతో పాటు 'ఢీ' షోలో టీమ్ లీడర్ గా వ్యవహరిస్తోన్న రష్మీ సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటుంది. మూగ జీవాలను కాపాడాలంటూ ఎప్పటికప్పుడు రష్మీ పోస్ట్ లు పెడుతూనే ఉంటుంది. అలానే లాక్ డౌన్ సమయంలో ఆకలితో ఇబ్బంది పడుతున్న వీధి కుక్కలకు ఆహరం అందేలా రష్మీ చర్యలు చేపట్టింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.