English | Telugu

మోనాల్ వ‌ల్లే షో చూడ్డం మానేశాం.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ నటిగా సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ నుండి షిఫ్ట్ అయి ఇతర భాషల్లో సినిమాలు చేసుకుంది. అదే సమయంలో ఆమెకి బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ రావడంతో తిరిగి ఇక్కడకి వచ్చింది. హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన వెంటనే ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వార్తల్లో నిలిచింది. అఖిల్, మోనాల్, అభిజిత్ లకు సంబంధించి రోజూ వార్తలు వచ్చేవి. అయితే కొన్నిరోజులకే అభిజీత్ దూరం పెట్టడంతో అఖిల్ తో మోనాల్ మరింత క్లోజ్ అయింది.

దీంతో ఇద్దరి మధ్య ఏదో ట్రాక్ నడుస్తోంద‌ని ఫిక్స్ అయిపోయారు జనాలు. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం, చనువుగా ఉండడం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ షో అనంతరం మోనాల్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అలానే బుల్లితెరపై ప్రసారమవుతోన్న 'డాన్స్ ప్లస్' షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. అయితే మోనాల్ ని జడ్జ్ గా తీసుకున్నప్పటి నుండి ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు.

ఆమెకి జడ్జ్ గా ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డాన్స్ ప్లస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మోనాల్ స్టేజ్ పైకి వెళ్లి ఓ కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మోనాల్ ని మరింత టార్గెట్ చేశారు. మోనాల్ వలనే ఈ షో చూడడం మానేశామంటూ మండిపడుతున్నారు. అందరూ డాన్స్ మాస్టర్స్ జడ్జ్ గా వ్యవహరిస్తుంటే ఈమెను ఎలా తీసుకున్నారంటూ మోనాల్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్ పై మోనాల్ స్పందిస్తుందేమో చూడాలి!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.