Read more!

English | Telugu

రష్మీ ఇంట్లో విషాదం.. కన్నీటితో తుది వీడ్కోలు

బుల్లితెర మీద ఫేమస్ యాంకర్, హీరోయిన్ రష్మీ గురించి తెలియని వారు లేరు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఫ్యామిలీలో ఒక  కీలకమైన వ్యక్తి మరణించారు. ఈ విషయాన్ని రష్మీ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 

అసలు విషయంలోకి వెళితే రష్మీ గౌతమ్ బామ్మ ప్రమీలా మిశ్రా శుక్రవారం తుది శ్వాస విడిచారు. బరువెక్కిన గుండెతో కుటుంబం అంతా ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికామని పేర్కొంది రష్మీ. '' అమ్మమ్మ ప్రమీలామిశ్రా చాలా స్ట్రాంగ్ వుమన్. మాపై ఆమె ప్రభావం ఎంతో ఉంది. ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా ఆమె జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ మాతోనే ఉంటాయి. ఓం శాంతి'' అని రష్మీ ఒక పోస్ట్ పెట్టింది. 

రష్మీ గౌతమ్ 'ఎక్స్ట్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలకు యాంకరింగ్ చేస్తోంది. మరోవైపు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. మూవీస్ లో మంచి పాత్రలకు ఆఫర్స్ వస్తున్నాయని కానీ డిఫరెంట్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. లాస్ట్ ఇయర్  రష్మీ హీరోయిన్ గా  నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలైంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటిస్తోంది రష్మీ.