Read more!

English | Telugu

ఫ్యామిలీతో టూర్ కి వెళ్లిన రసజ్ఞ రీతూ...

గుప్పెడంత మనసు సీరియల్ లో నటించిన రసజ్ఞ రీతూ రీసెంట్ గా ఫ్యామిలీ ట్రిప్ వేసింది. ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్స్స్ వలన ట్రిప్ కి రావాల్సి వచ్చినట్టు చెప్పింది. అలాగే ఎప్పుడో  12 ఏళ్ళ క్రితం ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్ కి వెళ్లినట్టు చెప్పింది.  ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అందరూ కలిసి ట్రిప్ వేసినట్టు చెప్పింది. ఊటీలోని కూనూర్ కి వెళ్ళింది రసజ్ఞ ఫ్యామిలీ . ఇక వాళ్ళ అత్తమ్మ వండిన మునక్కాయ మటన్ కర్రీ రెసిపీ చూపించింది. ఇంతకు విషయం ఏమిటో చెప్పలేదు కానీ ఇప్పుడిప్పుడే కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి బయట పడుతున్నా అంటూ చాలా బాధతో చెప్పింది. ఈ వీడియోని చాలా అన్ ప్రొఫెషనల్ గా చేస్తున్నానని సారీ కూడా చెప్పింది. ఇక కెమెరా తీసుకుని కొండ మీద నుంచి కింద వరకు వచ్చేసింది రసజ్ఞ రీతూ.

పాములేమన్నా ఉంటాయేమో అని కూడా భయపడిపోయింది. అలాగే అక్కడ ఒక చిన్న పెంకుటిల్లును కూడా చూపించింది.. అలాంటి ఇల్లు ఉంటే అందులో అన్నిరకాల ఫెసిలిటీస్ ఉంటే చాలా బాగుంటుంది అని కూడా చెప్పింది. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తే ఇలా నేచర్ లోకి వెళ్లి రావాలని చెప్తారు చాలా మంది. అలా ఈ నేచర్ లోకి వచ్చేసరికి చాలా రెఫ్రెషింగ్ గా ఉందని, పక్షుల అరుపులు మనసుకు హాయిగా ఉందని చెప్పింది. అలాగే 1947 కంస్ట్రక్ట్ చేసిన ఒక పురాతన బిల్డింగ్ ని చూపించింది. ఈ హౌస్ అంతా ఓల్డ్ మూవీస్ లో చూపించే లొకేషన్ లా ఉందని చెప్పింది. అక్కడ ఉన్న రూమ్స్, బెడ్స్, బాల్కనీ అన్నీ కూడా చూపించింది. ఇక ఫామిలీ మొత్తం కలిసి బోట్ షికారు కి వెళ్లారు. తర్వాత ఇషా ఫౌండేషన్ కి వెళ్లారు. అక్కడ చాలా పీస్ ఫుల్ గా ఉందని చెప్పింది. తన లైఫ్ లో ఉన్న సమస్యలన్నీ పోయాయని చెప్పడం కష్టం కానీ ఈ టూర్ వలన కొంత వరకు మానసిక ప్రశాంతత అనేది వచ్చిందని చెప్పింది రసజ్ఞ రీతూ.