English | Telugu

డాన్స్ షోలో రమ్యకృష్ణ!

కరోనా వైరస్ విజృంభ‌ణకారణంగా నిలిచిపోయిన షూటింగ్స్ ను ఇప్పుడిప్పుడే మొదలుపెడుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా కోవిడ్ కేసులు భారీగా పెర‌గ‌డంతో సినిమా, టీవీ షూటింగ్ లను నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి రావడంతో రమ్యకృష్ణ షూటింగ్ లో పాల్గొంటున్నారు. విజ‌య్ టీవీలో ప్రసారమవుతోన్న 'బీబీ జోడిగళ్' డాన్స్ షోకి రమ్యకృష్ణ కో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ షోకి సంబంధించిన షూటింగ్ లో రమ్యకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రమ్యకృష్ణ. "బీబీ జోడిగళ్ సెట్ కు మళ్లీ వచ్చేశాం.. సేఫ్టీ ప్రొటోకాల్స్‌తో షూటింగ్ కొనసాగుతోంది. మాస్క్ లు పెట్టుకొని.. సురక్షితంగా షూటింగ్ చేస్తున్నాం" అంటూ రాసుకొచ్చారు రమ్యకృష్ణ. ఆ త‌ర్వాత ఆ షో లేటెస్ట్ ప్రోమో వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండమంటూ సలహాలు ఇస్తున్నారు.

ఈ షోలో వనితా విజయ్ కుమార్ ఓ కంటెస్టెంట్. ఆమె కూడా రమ్యకృష్ణతో పాటు షూటింగ్ లో పాల్గొంది. ఈ షోలో సురేష్ చక్రవర్తితో కలిసి వనితా విజయ్ కుమార్, సోమశేఖర్‌తో శివానీ నారాయణ్, అజిద్ ఖాలీక్యుతో గ్యాబ్రియెల్లా చార్లటన్, షరీఖ్ హసన్‌తో అనితా సంపత్, సంయుక్త కార్తీక్‌తో జితన్ రమేష్ తదితరులు పాల్గొంటున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.