English | Telugu
రక్ష నింబార్గి షూటింగ్ లో ఏం చేసిందో చూస్తే షాకవ్వాల్సిందే!
Updated : Apr 10, 2024
బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా టీవీ సీరియళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. అందులోను తాజాగా మొదలైన ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ కి అప్పుడే ఫ్యాన్ పేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి. రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గికి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. అయితే తను యూట్యూబ్ లో తాజాగా చేసిన ఓ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది.
సీతాకాంత్, రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ప్రధాన పాత్రలుగా తాజాగా ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్ స్టార్ మా టీవీలో ప్రారంభమైంది. భార్యామణి, అష్టా చెమ్మ సీరియల్స్ లలో నటించి సీతాకాంత్ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. రక్ష నింబార్గి కన్నడ భామ. బింగో అనే కన్నడ మూవీతో వెండితెరపై అరంగేట్రం చేస్తుంది. రక్ష నింబార్గి తెలుగులో చేస్తోన్న తొలి సీరియల్ ఎటో వెళ్ళిపోయింది మనసు. ఇదే సీరియల్ లో సందీప్ భార్యగా శ్రీవల్లి చేస్తోంది. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ రామలక్ష్మి, సీతాకాంత్ మధ్యలో చాలానే ఏజ్ గ్యాప్ ఉంది. కానీ వారిది పూర్వజన్మ బంధమని సీరియల్ మొదటి ఎపిసోడ్ లో చూపించారు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్లలో సూపర్ ట్విస్ట్ వచ్చేసింది. రామలక్ష్మి వాళ్ళ నాన్నకి , సీతాకాంత్ వాళ్ళ నాన్న శ్రీలతకి మధ్య ఏదో తెలియని రహస్యం దాగి ఉందని తెలుస్తోంది. అలాగే రామలక్ష్మి, సీతాకాంత్ పెళ్ళి చేసుకున్నారని అందరిని నమ్మించగా.. మాణిక్యం మరో మెలిక పెట్టాడు. రామలక్ష్మి ప్రెగ్నెంట్ అయితేనే సిరి, ధనల పెళ్ళి జరుగుతుందని చెప్పాడు. మరి రామలక్ష్మి, సీతాకాంత్ లు మాణిక్యం చెప్పినట్లు చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డైరెక్టర్ పెట్టిన ఈ ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అయితే మరి అసలు గతంలో ఏం జరిగిందనేది కీలకంగా మారింది. మాణిక్యం, శ్రీలతల మధ్య జరిగిన దాగి ఉన్న మిస్టరీ ఏంటనే క్యూరియాసిటితో ఈ సీరియల్ సాగుతుంది.
రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ చేసింది. అదేంటో ఓసారి చూసేద్దాం... షూటింగ్ జరుగుతుండగా రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి ఓ వ్లాగ్ చేసింది. ఇందులో తన చెల్లి, తమ్ముడు ధన, అమ్మ సుజాత, నాన్న మాణిక్యంతో కలిసి ఓ ట్రాలీలో వెళ్తుంటారు. అక్కడ డైరెక్టర్ సీరియస్ గా డైలాగ్ చెప్తుంటే రక్ష నింబార్గి అదంతా తన వ్లాగ్ లో చూపించింది. ఇక అది చూసిన డైరెక్టర్ తనేనేం అనలేక పక్కకి వెళ్ళాడు. ఇక రామలక్ష్మికి తెలుగు రాదు కాబట్టి ఆ డైలాగ్స్ ని దర్శకుడి మాటలని అంతగా తీసుకోలేకపోయింది. కాగా తర్వాతి ఎపిసోడ్ లలో రామలక్ష్మి ఫ్యామిలీ కలసి ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టుగా ఈ వ్లాగ్ లో ముందుగా తెలిసిపోయింది. కాగా రామలక్ష్మి అలియాస్ రక్ష నింబార్గి చేసిన ఈ వ్లాగ్ నెట్టింట వైరల్ గా మారింది.