English | Telugu

Brahmamudi : అనుకున్నది చేసిన రుద్రాణి.. కావ్య తన పాపని కనిపెడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -934 లో..... కావ్య ప్రవర్తనతో డాక్టర్ కి విసుగు పుట్టి డిశ్చార్జ్ చేస్తుంది. అ విషయం రాజ్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. అదేంట్రా హాస్పిటల్ లోనే ఇంకా రెండు రోజులు ఉండాలి కదా అని ఇందిరాదేవి అనగానే కావ్య ప్రవర్తన చూసి రెండు రోజులు కాదు కదా రెండు గంటలు కూడా ఉంచుకోరని రాజ్ చెప్తాడు. కావ్యకి పాపని ఇస్తుంది నర్సు. నా పాప కాదు నేను తీసుకోనని కావ్య అనగానే మీరు డిశ్చార్జ్ అవుతున్నారు.. మీకు పాపని ఇవ్వడం మా బాధ్యత అని నర్సు అంటుంది. అప్పుడే రాజ్ వచ్చి పాపని తీసుకుంటాడు. మళ్ళీ కావ్య అలానే వాదిస్తుంది. నేను ఇంటికి రానని అంటుంది. నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టే అని రాజ్ అనగానే కావ్య ఏం చెయ్యలేక హాస్పిటల్ నుండి బయల్దేరుతుంది.

ఒక పక్క మినిస్టర్ తన భార్య బిడ్డతో..మరో పక్క కావ్య, రాజ్ హాస్పిటల్ నుండి బయలుదేర్తారు. అక్కడే ఉన్న రుద్రాణి, రాహుల్, రేఖ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అయిన అర్థం అయిందా మీ అమ్మ గురించి అని రుద్రాణి అనగానే మమ్మీ నువ్వు గ్రేట్ జీవితాలే తారుమారు చేసావని రాహుల్ అంటాడు. రాజ్ బావ నా సొంతం కావాలని రేఖ చెప్తుంది. రాజ్ ని నీ సొంతం చేసి రాహుల్ ని ఆ ఆస్తులకి అధిపతిని చేస్తానని రుద్రాణి అంటుంది. మరొకవైపు ఇంటికి వచ్చాక అందరు కావ్యకి నచ్చజెప్పాలని చూస్తారు. కానీ కావ్య ఎవరి మాట వినదు. రాజ్.. నువ్వు అయిన కావ్యకి చెప్పమని స్వప్న అంటుంది. కావ్య దగ్గరికి రాజ్ వెళ్లి నచ్చజెప్పాలని ట్రై చేస్తాడు.

నా కూతురు కాదని కావ్య చెప్తుంది. అసలు ఎలా నువ్వు పాప మారిందటున్నావని రాజ్ అడుగుతాడు. నేను కన్నతల్లిని నాకు స్పర్శ తెలియదా అని కావ్య అనగానే ప్రాక్టికల్ గా థింక్ చెయ్ అని రాజ్ అంటాడు. నా కూతురికి పుట్టుమచ్చ ఉంది. ఈ పాపకు లేదు. ఇది ప్రాక్టికల్ ఏ కదా అని కావ్య అంటుంది. నువ్వు తప్ప ఆ పుట్టుమచ్చ ఎవరు చూడలేదని రాజ్ అంటాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డ మారిపోయిందని కావ్య అంటుంది. మరొకవైపు పాపని చూస్తూ తులసి మురిసిపోతుంది. అప్పుడే రుద్రాణి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.