English | Telugu

బుల్లితెర‌పై హీరో త‌ల్లిగా రాశి!

వెండితెర‌పై క‌థానాయిక‌లుగా ఆక‌ట్టుకున్న వారితో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా వ‌ర‌కు బుల్లితెర‌ని ఆశ్ర‌యిస్తున్నారు. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒక‌నాటి హీరోయిన్ రాశి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజా ర‌వీంద్ర చేరుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మా కోసం 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' అనే పేరుతో రూపొందిన డైలీ సీరియ‌ల్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఇందులో 'సిరిసిరి మువ్వ‌లు' ఫేమ్ వంశీ ఆలూర్‌, 'మౌన‌రాగం' ఫేమ్ అమ్ములు పాత్ర ధారి ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారి వంశీ ఆలూరుకి రాశీ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, రాజా ర‌వీంద్ర మ‌రో కీల‌క పాత్ర‌ధారి ప్రియాంక జైన్‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. రెండు క‌ల‌ల మ‌ధ్య రెండు జీవితాలు ఒకే గూటికి చేర‌బోతున్నాయా అంటూ రిలీజ్ చేసిన ఈ సీరియ‌ల్ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

"జాన‌కి ఎంత చ‌దివినా అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడినే తీసుకొస్తాన‌"ని తండ్రి పాత్ర‌లో రాజా ర‌వీంద్ర చెబుతున్న డైలాగ్‌ల‌తో పాటు "మంచిది తెలివైంది అయితే ఫ‌ర‌వాలేదు. కానీ మావాడిక‌న్నా ఎక్కువ చ‌దివేసి పొగ‌రుగా వుంటే మాత్రం క‌ష్టం.. నా కోడ‌లు ఏడో ఎనిమిదో చ‌దివితే చాలు".. అని రాశి చెబుతున్న తీరు భిన్న మ‌న‌స్థ‌త్వాలు.. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' సీరియ‌ల్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.