English | Telugu

బుల్లితెర‌పై హీరో త‌ల్లిగా రాశి!

వెండితెర‌పై క‌థానాయిక‌లుగా ఆక‌ట్టుకున్న వారితో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌లుగా పేరు తెచ్చుకున్న వారు చాలా వ‌ర‌కు బుల్లితెర‌ని ఆశ్ర‌యిస్తున్నారు. వెండితెర‌పై అవ‌కాశాలు త‌గ్గ‌డంతో బుల్లితెర‌ని న‌మ్ముకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో ఒక‌నాటి హీరోయిన్ రాశి, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రాజా ర‌వీంద్ర చేరుతున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్టార్ మా కోసం 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' అనే పేరుతో రూపొందిన డైలీ సీరియ‌ల్‌లో బుల్లితెర ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నారు.

ఇందులో 'సిరిసిరి మువ్వ‌లు' ఫేమ్ వంశీ ఆలూర్‌, 'మౌన‌రాగం' ఫేమ్ అమ్ములు పాత్ర ధారి ప్రియాంక జైన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌ధాన పాత్ర‌ధారి వంశీ ఆలూరుకి రాశీ త‌ల్లిగా న‌టిస్తుండ‌గా, రాజా ర‌వీంద్ర మ‌రో కీల‌క పాత్ర‌ధారి ప్రియాంక జైన్‌కు తండ్రిగా క‌నిపించ‌బోతున్నారు. రెండు క‌ల‌ల మ‌ధ్య రెండు జీవితాలు ఒకే గూటికి చేర‌బోతున్నాయా అంటూ రిలీజ్ చేసిన ఈ సీరియ‌ల్ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

"జాన‌కి ఎంత చ‌దివినా అంత‌కంటే ఎక్కువ చ‌దివిన వాడినే తీసుకొస్తాన‌"ని తండ్రి పాత్ర‌లో రాజా ర‌వీంద్ర చెబుతున్న డైలాగ్‌ల‌తో పాటు "మంచిది తెలివైంది అయితే ఫ‌ర‌వాలేదు. కానీ మావాడిక‌న్నా ఎక్కువ చ‌దివేసి పొగ‌రుగా వుంటే మాత్రం క‌ష్టం.. నా కోడ‌లు ఏడో ఎనిమిదో చ‌దివితే చాలు".. అని రాశి చెబుతున్న తీరు భిన్న మ‌న‌స్థ‌త్వాలు.. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ఇద్ద‌రు యువ‌తీ యువ‌కుల క‌థ‌గా 'జాన‌కి క‌ల‌గ‌న లేదు' సీరియ‌ల్ వుండ‌బోతోంద‌ని తెలుస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.