English | Telugu

ఎలాంటి వీడియోలు పెట్టాలో పునర్నవికి చెప్ప‌రాదూ..!

బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు. అయితే అందులో కొంతమందికి సినిమా అవకాశాలు వస్తుంటాయి. కొందరు మాత్రం సోషల్ మీడియాకే పరిమితమవుతుంటారు. ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లు యూట్యూబ్ మీద పడ్డారు. రకరకాల వీడియోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

యూట్యూబ్ లో పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లో చాలా మంది కంటెస్టెంట్లు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి దుమ్ములేపుతున్నారు. శ్రీముఖి, శివజ్యోతి, హిమజ, అషురెడ్డి, రోహిణి ఇలా చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టారు. నాల్గో సీజన్ లో పాల్గొన్న లాస్య, సుజాత, అరియనా, అవినాష్, మెహబూబ్, సోహెల్ ఇలా అందరూ సెపరేట్ ఛానెల్స్ ఓపెన్ చేశారు. ఇప్పుడు పునర్నవి భూపాలం వంతు వచ్చింది.

ఈ మేరకు తన అభిమానుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంది. మాములుగా అయితే పునర్నవి యోగా వీడియోలు, ఆసనాల ఉపయోగాలు, బ్యూటీ టిప్స్ కి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి వీడియోలు పెట్టాలి..? వీక్లీ వ్లాగ్స్ పెట్టాలా..? లైఫ్ స్టైల్ కి సంబంధించినవి పెట్టాలా..? అని తన ఫ్యాన్స్ ను అడిగి తెలుసుకుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.