English | Telugu

ల‌వ్ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన న‌వ్య స్వామి!

ఈ మధ్య కాలంలో బుల్లితెర నటీనటులకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. సినీ సెలబ్రిటీల రేంజ్ లో ప్రేక్షకులు వారిని ఆరాధిస్తున్నారు. అలా భారీ పాపులారిటీ సంపాదించిన వారిలో నవ్య స్వామి ఒకరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ రేంజ్ లో గ్లామర్, చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈమె తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొంది.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో నవ్య స్వామి ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను కరోనా బారిన పడ్డ సమయాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. తను గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వలన.. ఎవరినీ రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలైనట్లు.. బాగా ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇంటి పనులు చేసుకోవడం నచ్చుతుందని చెప్పింది.

ఇదే షోలో అలీ.. నవ్య బ్రేకప్ గురించి ప్రశ్నించాడు. దానికి ఆమె ఒకప్పుడు బ్యాడ్ రిలేషన్ లో ఉన్నట్లు.. కానీ తరువాత బ్రేకప్ అయిందని.. ఇప్పుడు కాంటాక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. అలానే కెరీర్ ఆరంభంలో ఓ ఈవెంట్ మేనేజర్ తో గొడవైన విషయాన్ని అలీ ప్రస్తావించగా.. సదరు మేనేజర్ ని చచ్చేట్లు కొట్టానని చెప్పింది. కానీ దాని రీజన్ మాత్రం చెప్పలేదు. బహుశా ఫుల్ ఎపిసోడ్ లో చెప్పి ఉంటుందేమో చూడాలి! ఈ ప్రోమో వీడియో నెట్టింట బాగా సంద‌డి చేస్తోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.