English | Telugu

ల‌వ్ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన న‌వ్య స్వామి!

ఈ మధ్య కాలంలో బుల్లితెర నటీనటులకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. సినీ సెలబ్రిటీల రేంజ్ లో ప్రేక్షకులు వారిని ఆరాధిస్తున్నారు. అలా భారీ పాపులారిటీ సంపాదించిన వారిలో నవ్య స్వామి ఒకరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ రేంజ్ లో గ్లామర్, చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ బ్యూటీ. 'నా పేరు మీనాక్షి', 'ఆమె కథ' సీరియల్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈమె తాజాగా 'అలీతో సరదాగా' షోలో పాల్గొంది.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో నవ్య స్వామి ఎమోషనల్ అవుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తాను కరోనా బారిన పడ్డ సమయాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్పింది. తను గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం వలన.. ఎవరినీ రానివ్వలేదని.. ఆ సమయంలో తనకు తోడుగా ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలైనట్లు.. బాగా ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. ఇక తనకు ఇంటి పనులు చేసుకోవడం నచ్చుతుందని చెప్పింది.

ఇదే షోలో అలీ.. నవ్య బ్రేకప్ గురించి ప్రశ్నించాడు. దానికి ఆమె ఒకప్పుడు బ్యాడ్ రిలేషన్ లో ఉన్నట్లు.. కానీ తరువాత బ్రేకప్ అయిందని.. ఇప్పుడు కాంటాక్ట్ లో లేనని క్లారిటీ ఇచ్చింది. అలానే కెరీర్ ఆరంభంలో ఓ ఈవెంట్ మేనేజర్ తో గొడవైన విషయాన్ని అలీ ప్రస్తావించగా.. సదరు మేనేజర్ ని చచ్చేట్లు కొట్టానని చెప్పింది. కానీ దాని రీజన్ మాత్రం చెప్పలేదు. బహుశా ఫుల్ ఎపిసోడ్ లో చెప్పి ఉంటుందేమో చూడాలి! ఈ ప్రోమో వీడియో నెట్టింట బాగా సంద‌డి చేస్తోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.