English | Telugu

'మై విలేజ్ షో' అనిల్ వెరైటీ వెడ్డింగ్ కార్డ్‌!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మే నెలలో కొన్ని లక్షల సంఖ్యలో వివాహాలు జరగబోతున్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. దీంతో కొందరు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వివాహాలను జరుపుకునేందుకు రెడీ అవుతుండగా.. మరికొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. అయితే 'మై విలేజ్ షో" అనిల్ తాజాగా కొత్త పద్దతిని ఎన్నుకున్నారు. తన వెడ్డింగ్ కార్డులోనే అన్ని విషయాలను వివరించారు. మే 1న ఆయ‌న పెళ్లి ఆమ‌నితో జ‌రుగుతోంది. ఇన్‌స్టా లైవ్‌లో శ‌నివారం రాత్రి 8 గంట‌ల నుంచి ఈ పెళ్లిని చూసుకోవ‌చ్చ‌ని చెప్పారు.

ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా అయితే 'శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు' అంటూ పెళ్లి కార్డు మొదలుపెడతారు. కానీ అనీల్ మాత్రం తన పెళ్లి కార్డుని "శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్" అంటూ కరోనా నిబంధనల గురించి రాసుకొచ్చారు. ఇక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు చదువు సంధ్యల విషయం చెప్పాల్సిన దగ్గర.. "కరోనా నెగెటివ్" అంటూ రాశారు.

ఆ తరువాత.. ''మరువకుండా మీ ఫోన్‌ల 1-జీబీ డాటా ఆగపట్టుకొని పిల్లా..జెల్లా..ఐసోల్లు..ముసలోల్లు అందరూ ఫోన్‌ల ముందు అంతర్జాలంలో పెండ్లిసూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వదించగలరు. విందు.. లైవ్‌లో తల్వాలు పడ్డంక ఎవ్వరింట్ల ఆళ్లు బువ్వు తినుర్రి. బరాత్‌ ఉంది కానీ ఎవరింట్ల వాళ్లు పాటలు పెట్టుకొని ఎగురుర్రి. మీరు ఎగిరిన 15 సెకన్ల వీడియో మాకు పంపుర్రి.. దాన్ని వ్లోగ్‌లో పెడతాం. ఇక కట్నాలు, కానుకలు గూగుల్‌ పే లేదా ఫోన్‌ పే ద్వారా క్యూఆర్‌ స్కాన్‌ చేసి పంపండి'' అంటూ ఫన్నీగా పెళ్లి కార్డుని డిజైన్ చేశారు. తన పెళ్లికి వచ్చే కట్నకానుకలను కరోనాతో బాధ పడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని పెళ్లి కార్డులో ముద్రించారు. 'మై విలేజ్‌ షో'తో పాపులర్‌ అయిన అనిల్‌ కరోనా కాలంలో అందరూ ఒకేచోట ఉండడం ప్రమాదకరమని చెప్పే విధంగా తన పెళ్లి కార్డుని తయారు చేశారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.