Read more!

English | Telugu

దుగ్గిరాల ఇంట్లో సంగీత్.‌. ఈ వేడుకలో అది ముఖ్యమంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -120 లో.. స్వప్నని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడానికి మైఖేల్ ఎదురు చూస్తూ ఉంటాడు. పదే పదే స్వప్నతో మాట్లాడడానికి ట్రై చేస్తూ స్వప్నకి చిరాకు తెప్పిస్తాడు. ఈ రోజు మెహందీ ఫంక్షన్ కదా నాకు మెహందీ పెడతావా అని రాహుల్ ని స్వప్న అడుగుతుంది. నాకు పెట్టడం రాదని రాహుల్ అంటాడు.

మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది. ఇంట్లో ఆడవాళ్ళందరూ మెహందీ పెట్టుకుంటూ బిజీగా ఉంటారు.. అప్పుడే అక్కడికి కళ్యాణ్ వచ్చి.. మెహందీ ఫంక్షన్ ఇలాగేనా జరిగేది, మీ భర్తలు మీ చేతిపై వారి పేరు రాయాలని కళ్యాణ్ అంటాడు. ఇందిరాదేవి మా అయన పేరు చాలా పెద్దగా ఉంటుంది నా చేతిపై ఎలా పడుతుందని అంటుంది. మీరు అందరు కళ్ళు మూసుకోండని సీతరామయ్య అనగానే.. అందరూ కళ్లు మూసుకుంటారు. అప్పుడు సీతరామయ్య ఇందిరాదేవి చెయ్యిపై బావ అని రాస్తాడు. అది చూసి అందరూ సరదాగా నవ్వుకుంటారు.

ఇక అందరు తమ భార్యల చేతిపై తమ పేరు రాస్తారు. అన్నయ్య నువ్వు కూడా వదిన చేతిపై నీ పేరు రాయని రాజ్ తో కళ్యాణ్ అంటాడు. అందుకు రాజ్ ఒప్పుకోడు. ఇంట్లో వాళ్ళందరూ కావ్య చేతిపై రాజ్ పేరు రాయాలి అని అంటారు. ఇక రాజ్ చేసేదేమీ లేక కావ్య చేతిపై తన పేరు రాస్తాడు. అలా కావ్య చేతిలో రాజ్ పేరు రాయడం చూసి అందరూ సరదాగా రాజ్ ని ఆటపట్టిస్తారు. కనకం కృష్ణమూర్తి అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక అబద్ధం ఆడి వీళ్ళ పెళ్లి చేశాను. వీళ్ళ సంతోషం కోసమే అని కనకం అంటుంది. నువ్వు ఆడిన ఒక అబద్ధం ఇంత అందంగా కనిపిస్తుంది మొదటి సారి అని కృష్ణమూర్తి అంటాడు. కావ్య తన చేతిపై రాజ్ రాసిన ఆర్ లెటర్ చూసి మురిసిపోతుంది.

మరొకవైపు సుభాష్ దగ్గరికి ప్రకాష్ వస్తాడు. ఏంటి అన్నయ్య ఇలా ఉన్నావ్ అని అడుగుతాడు. మనం హుషారుగా డాన్స్ చెయ్యడానికి యూత్ కాదు కదా అని సుభాష్ అంటాడు. ప్రకాష్ జ్యూస్ ఇస్తూ.. అన్నయ్య ఇది జ్యూస్ కాదు ఇందులో ఒడ్కా కలిపానని ప్రకాష్ అనగానే..  సుభాష్ అది తీసుకొని తాగేస్తాడు. మరొకవైపు మైఖేల్ మందు కలిపిన జ్యూస్ ని ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి, కావ్య, రుద్రాణిలకు ఇస్తాడు. ఒక్కసారి ధాన్యలక్ష్మి తాగి.. ఈ జ్యూస్ బాగుందని మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తాగుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.