English | Telugu

Brahmamudi : మినిస్టర్ షాక్.. ఆమె బిడ్డని కావ్య కనిపెడుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -933 లో.. పాపని తీసుకొని వచ్చి కావ్యకి డాక్టర్ ఇవ్వగానే తను నా బిడ్డ కాదని అంటుంది. అందరు షాక్ అవుతారు. ఏంటి కావ్య అలా మాట్లాడుతున్నావ్.. అలా అనకూడదని డాక్టర్ కోప్పడుతుంది. నేను మొదటి సారి ఎత్తుకున్నప్పడు నాకు అమ్మ ఫీలింగ్ వచ్చింది. ఈ పాపని ఎత్తుకుంటే రావడం లేదు. ఇంకా నేను నా బిడ్డని చూసినప్పుడు.. తన చేతికి పుట్టుమచ్చ కూడా ఉంది. ఈ పాపకి లేదు ఎవరో మార్చేశారని కావ్య ఏడుస్తుంది.

నువ్వేం మాట్లాడుతున్నావ్.. ఎవరు మారుస్తారు.. కాసేపు పడుకోమని డాక్టర్ కోప్పడుతుంది. ఏవండి.. ఈ బిడ్డ మన బిడ్డ కాదండి అని రాజ్ తో కావ్య అంటుంది. మన బిడ్డే.. నువ్వు ఎందుకు అలా అంటున్నావని రాజ్ అంటాడు. మరొకవైపు పాపని ఎత్తుకొని మినిస్టర్ ముద్దాడుతుంటే తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే రుద్రాణి వచ్చి మీతో మాట్లాడాలని అంటుంది. రుద్రాణిని తులసికి పరిచయం చేస్తాడు మినిస్టర్. మినిస్టర్, రుద్రాణి బయటకు వస్తారు. మీరు అర్జెంటుగా డిశ్చార్జ్ అయి వెళ్ళండి. ఆ కావ్య తన దగ్గర ఉన్న పాప తన బిడ్డ కాదని తెలుసుకుందని అనగానే మినిస్టర్ టెన్షన్ పడతాడు. ఆ తర్వాత కావ్య ఎందుకు అలా ప్రవర్తిస్తుందోనని అందరు అనుకుంటారు. మరొక పక్క కావ్య తన బిడ్డ కోసం వార్డ్ లో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఆ విషయం నర్స్ వచ్చి చెప్పగా అందరు కావ్య దగ్గరికి వెళ్తారు.

డాక్టర్ వచ్చి కావ్యపై కోప్పడుతుంది. అర్జెంట్ గా కావ్యని తీసుకొని వెళ్లిపోండి అంటుంది. ఆ తర్వాత డాక్టర్ తులసి దగ్గరికి వస్తాడు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని తులసి అడుగుతుంది. బిడ్డని మార్చేసిన విషయం డాక్టర్ కి తెలియదు.. ఇంకా పాపకి ప్రాబ్లమ్ ఉంది కదా అనుకొని ఇంకా టైమ్ పడుతుందని డాక్టర్ అంటాడు. అప్పుడే మినిస్టర్ వచ్చి మేం డిశ్చార్జ్ అవుతాం.. అన్నీ సిద్ధం చెయ్యండి అని అంటాడు. డాక్టర్ కి ఏం అర్థం కాదు.. దాంతో డాక్టర్ ని బయటకు తీసుకొని వెళ్లి మేం వెళ్ళిపోతామని మినిస్టర్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్ ని డాక్టర్ పిలిచి మాట్లాడుతుంది. తను ఒత్తిడిలో ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు.. పిల్లలు చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు.. మీరు తనని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని రాజ్ తో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.