Read more!

English | Telugu

Karthika Deepam2 :  వాళ్ళకి కార్తిక్ చెప్పాలనుకున్న నిజమేంటి.. నాన్నెవరో శౌర్యకి తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '... ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -23 లో.. కార్తీక్ వెళ్తుంటే .. శౌర్యకి కొన్న డ్రెస్ తీసుకొని వచ్చి ఎందుకు కొనిచ్చారని దీప అడుగుతుంది. ఎందుకు నా కూతురికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు.. మీరు అలా నా కూతురితో చనువు గా ఉండడం.. నాకు ఇష్టం లేదు.‌ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని కార్తీక్ ని దీప అడుగుతుంది. మీరు మా అత్తయ్యని ఏ ఉద్దేశంతో కాపాడారని అడుగుతాడు. మీరు కాపాడడంలో ఏ ఉద్దేశం లేనప్పుడు నేను సాయం చెయ్యడంలో ఏ ఉద్దేశం లేదని దీపతో కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత మీ భర్త అక్కడ కన్పించాడనగానే.. మీరు అతని గురించి శౌర్యకి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది. కన్నతల్లి మీరే ఏం చెప్పలేదు.. నేను ఎందుకు చెప్తాను. అసలు ఏం జరిగింది? నా వల్ల ఏమయినా సాయం చేస్తానని అనగానే.. నిజంగానే చేస్తారా అని దీప అంటుంది.  నా వల్ల కాకపోయిన చేస్తానని కార్తీక్ అంటాడు. అయితే నా కూతురికి దూరం గా ఉండండి.. అదే మీరు చేసే పెద్ద సాయమని దీప అంటుంది. ఆ తర్వాత ఆ సాయం నేను చెయ్యలేను.. దీప ఇప్పటికే పశ్చాతాపంతో ఉన్న ఆ చిన్నదాని సరదాలు తీర్చి.. తన ఆనందపడుతుంటే నాకు కొంచం అయిన హ్యాపీగా ఉందని కార్తీక్ అనుకుంటాడు. ఆ తర్వాత నరసింహకి వాళ్ళావిడ భోజన పెట్టి కారం, ఉప్పు మాత్రమే వేస్తుంది. నీకు రోషం, పౌరుషం లేవు అందుకే ఆ దీప నీకు భయపడడం లేదు.. నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఆ దీప ఊళ్ళో ఉండడానికి వీలు లేదు..ఈ గాజులు నువ్వు వేసుకోవాలో నేను వేసుకోవాలో తేల్చుకోని నర్సింహ భార్య శోభ అంటుంది.

మరొకవైపు తనకి జ్యోత్స్న అంటే ఇష్టం లేదన్న విషయం తన పేరెంట్స్ కి కార్తీక్ చెప్పాలనుకుంటాడు. కానీ కాంచన.. జ్యోత్స్న పై పెంచుకున్న ప్రేమని విని కార్తీక్ చెప్పలేకపోతాడు. పారిజాతం ద్వారా చెప్పించాలని కార్తీక్ అనుకుంటాడు. మరుసటిరోజు ఉదయం దీప ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే.. శౌర్య వచ్చి పేపర్ పై వాళ్ళ అమ్మది‌‌.. తనది పెన్సల్ తో గీసి హ్యాపీ బర్త్ డే అని చెప్తుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అతనికి మా అమ్మ బర్త్ డే అని శౌర్య చెప్తుంది. ముగ్గులో వెయ్యడానికి పూలు తీసుకొని రమ్మని శౌర్యని దీప పంపిస్తుంది. వాళ్ళు తిడతారేమో అని శౌర్య అనగానే.. వాళ్ళ ముగ్గు కోసం ఏం అనరని దీప అనగానే.. శౌర్య వెళ్లి పూలుకోస్తుంటే అప్పుడే బంటు వచ్చి వద్దని అంటాడు. మా అమ్మ తీసుకొని రమ్మని చెప్పిందని శౌర్య అంటుంది. మీ అమ్మ వచ్చినా.. నేను పూలు కోయనివ్వనని బంటు అంటాడు. దాంతో ఆ విషయం దీప దగ్గరకి శౌర్య వచ్చి చెప్తుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.