Read more!

English | Telugu

Eto Vellipoyindhi Manasu : శోభనం గదిలోకి వెళ్ళి డల్ గా ఉన్న అమ్మాయి.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో... సీతాకాంత్ రాగానే శోభనానికి రెడీ అవ్వమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ షాకింగ్ గా.. ఇప్పుడు ఎందుకంటాడు. ఎందుకు అలా అంటున్నారు.. రామలక్ష్మి రెడీ అవమంటే తలనొప్పి అంటూ ఎదో ఒక సాకు చెప్తుంది.. నువ్వు ఇలా అంటున్నావ్.‌. అసలు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అంటు శ్రీలత అడుగుతుంది. చేసుకున్నాం మీరు అలా అనకండి అంటూ సీతాకాంత్ అంటాడు. నా మనవడు సిగ్గుతో అలా అంటున్నాడు అంతే నేను వెళ్లి నా మనవడిని రెడీ చేస్తానని పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత గదిలోకి వెళ్లక రామలక్ష్మిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావ్.. శోభనం ఎందుకు వద్దంటున్నావ్? రామలక్ష్మి, అభి ఇద్దరు ప్రేమించుకున్న విషయం గుర్తుకొచ్చిందా అని సీతాకాంత్ ని పెద్దాయన అడుగుతాడు. అసలు మేమ్ పెళ్లి చేసుకోలేదని నిజం చెప్పబోతు ఆగిపోతాడు సీతాకాంత్. ఆ తర్వాత మీరు అన్నదే నిజమని సీతాకాంత్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి రెడీ అయి శ్రీలత అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. " సర్ నేను నరకం చూస్తున్నాను.. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పోతున్నాను" అని సీతాకాంత్ తో చెప్పుకుంటూ రామలక్ష్మి ఏడుస్తుంది. అభి వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగయ్యాక వెంటనే నిన్ను, అభిని ఫారెన్ పంపిస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. అప్పుడే శ్రీవల్లి వచ్చి మిమ్మల్ని అత్తయ్య రమ్మంటుందని పిలుస్తుంది.

ఆ తర్వాత శ్రీలత వాళ్ళు పెళ్లి చేసుకోలేదన్న విషయం బయట పెట్టడానికి.. కావాలనే పూలబంతి ఆటకి ఏర్పాట్లు చేస్తుంది. రామలక్ష్మి, సీతాకాంత్ లు వచ్చి చూసి షాక్ అవుతారు. పెద్దాయన పూలబంతి ఎందుకు ఆడుతారో చెప్తాడు. ఎప్పుడెప్పుడు పెళ్లి కాలేదన్న విషయం బయటపెడుతారని శ్రీలత వెయిట్ చేస్తుంటుంది. ఇద్దరు పూలబంతి ఇష్టం లేకుండా ఇబ్బంది పడుతూనే విసురుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మిని పాల గ్లాస్ తో గది లోపలికి పంపిస్తారు. సంవత్సరంలోపు నాకు మనవడినో.. మనవరాలినో ఇవ్వాలని శ్రీలత అంటుంటే రామలక్ష్మి ఇబ్బందిపడుతుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి డల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.