Read more!

English | Telugu

Karthika Deepam 2 : వాళ్ళిద్దరు ఒకేసారి కేక్ కట్ చేశారు.. పాపం శౌర్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -24 లో...శౌర్య పూలు కోస్తుంటే బంటు వచ్చి ఆపుతాడు. మా అమ్మ పూలు తీసుకొని రమ్మని చెప్పిందని శౌర్య అనగానే..  మీ అమ్మ వచ్చిన గానీ కోయనియ్యనని బంటు అంటాడు. ఇక దీపని శౌర్య పిలుస్తుంది. ఆ లోపు పారిజాతం వచ్చి.. ఇది వరకే గొడవ అయింది. మళ్ళీ ఆ దీప వస్తే గుర్తుపడుతుంది నువ్వు సైలెంట్ గా ఉండమని బంటుకి పారిజాతం చెప్తుంది. శౌర్య నువ్వు పూలు కోసుకోమని పారిజాతం చెప్తుంది.

ఆ తర్వాత జ్యోత్స్న పుట్టిన రోజు గనుక కార్తీక్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కి కార్తిక్ విషెస్ చెప్పగానే.. వట్టి విషస్ ఏనా గిఫ్ట్ ఏం లేదా అంటుంది. చాటు నుండి పారిజాతం కార్తీక్ చేతిలో రోస్ ఫ్లవర్ పెడుతుంది. అది చూసిన జ్యోత్స్న.. నా కోసం తెచ్చావా? నీ లవ్ ని.. గిఫ్ట్ గా ఇస్తున్నావా అంటు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి కార్తిక్ వస్తాడు. ఈ రోజు శౌర్య వాళ్ళ అమ్మ దీప బర్త్ డే అనగానే.. అవునా అని సుమిత్ర అంటుంది. అప్పుడే శౌర్య రావడంతో మీ అమ్మని పిలుచుకొని రమ్మని సుమిత్ర చెప్తుంది. అందరూ జ్యోత్స్న కేక్ కట్ చెయ్ అనగానే.. దీప వచ్చేదాకా ఆగమని పారిజాతం మీద శివనారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత దీప వస్తుంది. ఈ రోజు దీప బర్త్ డే అని అనగానే.. అందరు విషెస్ చెప్తారు. పారిజాతం మాత్రం పుట్టినప్పుడు బిడ్డని దూరం చేసిన విషయం గుర్తుకుచేసుకుంటుంది. అయిన ఆ విషయం ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నానని మళ్ళీ తనే అనుకుంటుంది. జ్యోత్స్న, దీపలని ఒకేసారి కేక్ కట్ చెయ్యమని సుమిత్ర చెప్పగానే.. ఆగండి అంటూ శౌర్య వెళ్లి బన్ను ముక్క తీసుకొని వచ్చి.. ఇది నా బర్త్ డే కి కట్ చేస్తానని అనగానే అందరు తన వంక జాలిగా చూస్తారు. ఇప్పుడు కేక్ కట్ చెయ్ అనగానే ఇద్దరు కేక్ కట్ చేస్తారు. శౌర్యకి దీప కేక్ తినిపిస్తుంది.

అమ్మ కార్తీక్ కి కూడా తినిపించు అని శౌర్య అనగానే.. అందరు షాక్ అవుతారు. నేను తినిపిస్తానులే మా బావకి అని జ్యోత్స్న అంటుంది .. ఆ తర్వాత శౌర్యని స్కూల్ లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాం.. నువ్వు కూడా ఇక్కడే ఉండని దశరత్ అంటాడు. దానికి దీప వద్దని అంటుంది. శౌర్య ఇక్కడే చదువుకుంటే బాగుంటుందని జ్యోత్స్న అనగానే.. ఊళ్ళో పని ఉందని దీప అంటుంది. ఆ తర్వాత గుడికి వెళదామని దీపతో సుమిత్ర చెప్తుంది. మరొకవైపు నరసింహ భార్య శోభ.. నర్సింహతో గొడవ పడుతుంది. ఇప్పుడు మా అమ్మ వస్తుంది అనగానే నర్సింహ భయపడతాడు. దాంతో ఎలా ఉండేవాన్ని ఎలా చేసావే దీప అని నర్సింహ అనుకుంటాడు. మరొకవైపు మల్లేష్ అప్పు తీర్చలేదని ఇల్లు వేళం వెయ్యాలని ఊరి పెద్దలు చెప్పగా.. వద్దని అనసూయ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.