Read more!

English | Telugu

శోభనం గదిలో రామలక్ష్మి కన్నీరు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -77 లో.. రామలక్ష్మిని శోభనానికి రెడీ చేస్తుంది శ్రీలత. సంవత్సం లోపు పాపనో లేక బాబునో ఇవ్వాలని రామలక్ష్మితో శ్రీలత చెప్పి గదిలోకి పంపిస్తారు. రామలక్ష్మి గదిలోకి వెళ్ళాక.. చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మ శోభనానికి ఏర్పాట్లు చెయ్యగానే నువ్వు చాలా భయపడ్డావ్.. కానీ మనం ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లాగే ఉంటామని సీతాకాంత్ అంటాడు. మీకు ఇది మాములుగా ఉండొచ్చు కానీ ఒక అమ్మాయిగా నాకు చాలా ఇబ్బందిగా ఉందని రామలక్ష్మి అంటుంది. 

మనం నిజంగానే పెళ్లి చేసుకున్నామనుకొని మా అమ్మ చాలా హ్యాపీగా ఉంది.. తనని మోసం చేస్తున్నానని ఎదురుగా చూడలేకపోతున్నానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి ఏడుస్తుంటే సీతాకాంత్ చూడలేకపోతాడు. ఇప్పటికిప్పుడు ఈ సమస్యకి పరిష్కారమేంటో అర్థం కావడం లేదని సీతాకాంత్ అంటాడు. మరొకవైపు సీతాకాంత్ ఇచ్చిన డబ్బులతో అభి ఒక అమ్మయిని తీసుకుని వచ్చి.. ఇక నుండి నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ వి అని చెప్తాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ కి సీతాకంత్ ఒక అమాయకుడు అంటూ చెప్తుంటాడు. అప్పుడే సీతాకంత్ వచ్చి.. అది విని తనని కొట్టినట్టు ఉహించుకుంటాడు. ఆ తర్వాత ఊహలో నుండి బయటకు వచ్చి సీతా సర్ కి నా గురించి నిజం తెలియకూడదని అభి అనుకుంటాడు. అప్పుడే అభికి సీతాకాంత్ ఫోన్ చేసి... రామలక్ష్మి అనవసరంగా భయపడుతుంది. ఒకసారి మాట్లాడనమని.. అనగానే రామలక్ష్మితో అభి మాట్లాడతాడు.

ఆ తర్వాత శ్రీలత దగ్గరికి సందీప్ వచ్చి.. రామలక్ష్మితో గుళ్ళో మాట్లాడిన అతని పేరు అభి అంట అని చెప్తాడు. దాంతో వాడి గురించి మొత్తం కనుక్కో, రహస్యం గా రామలక్ష్మితో ఎందుకు మాట్లాడాడు.. ఏదో జరుగుతుందని శ్రీలత అంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి వచ్చి.. రామలక్ష్మి, సీతాకాంత్ ల గది డోర్ కొడుతుంది. ఎవరో వచ్చారని శోభనం జరిగినట్టుగా, వాళ్ళకి అర్థమయ్యేలా రామలక్ష్మి తన జుట్టుని చెరుపుకుంటుంది. ఆ తర్వాత రామలక్ష్మిని చూసిన శ్రీవల్లి నిజంగానే శోభనం జరిగిందనుకుంటుంది. ఆ విషయం వెళ్లి శ్రీలతకి చెప్తుంది. ఆ తర్వాత అందరు టిఫిన్ చేస్తుంటే.. సీతాకాంత్ బయటకు వెళ్తుంటాడు. అప్పుడే ఏవండీ అంటూ రామలక్ష్మి పిలవగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.