Read more!

English | Telugu

రుద్రాణి, రేఖల ప్లాన్ సక్సెస్.. కనకంని మళ్ళీ మోసం చేసిన స్వప్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -97 లో...ధాన్యలక్ష్మిని రాజ్ బాధపెట్టడంతో.. తను ఏడుస్తూ గదిలోకి వెళ్తుంది. అలా ధాన్యలక్ష్మి ఏడుస్తుండగా కావ్య వచ్చి ఎందుకు ఏడుస్తున్నారు చిన్న అత్తయ్య అని అడుగుతుంది. నువ్వు, రాజ్ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను.. అదేంటని అడిగినందుకు.. మా భార్య భర్తల విషయంలో కలుగజేసుకోకని రాజ్ చెప్పాడు.. చిన్నప్పటి నుండి వాడిని కళ్యాణ్ కంటే ఎక్కువగా ముద్దు చేశానని ధాన్యలక్ష్మి బాధపడుతుంది. అత్తయ్య రాజ్ ది చిన్న పిల్లల మనస్తత్వం.. అవన్నీ పట్టించుకోకండి అని కావ్య అంటుంది.

మరొకవైపు స్వప్న, రాహుల్ ని కలవడానికి బయటకు వెళ్తుంటే.. బయటనే కనకం ఉంటుంది. ఎలాగైనా అమ్మని దాటి వెళ్లాలని అలోచించిన స్వప్న.. అమ్మ ఈ పనులు నువ్వు చేయడమేంటి.. నువ్వు రెస్ట్ తీసుకో నేను చేస్తానని స్వప్న అనగానే.. ఏంటి స్వప్న ఇలా మాట్లాడుతుంది.. చేసిన తప్పు తెలుసుకొని మారిపోయిందా అని అనుకొని.. లోపలికి వెళ్తుంది కనకం. అలా కనకం లోపలికి వెళ్ళడం చూసిన స్వప్న వెంటనే బయటకు వెళ్లిపోతుంది. మరొకవైపు దుగ్గిరాల వారింట్లో కావ్య పూజ చేస్తుంది. అందరూ పూజ దగ్గరికి వస్తారు. అపర్ణ వచ్చి ఈ ఇంట్లో అత్తయ్య తర్వాత నేను మాత్రమే పూజ గదిలోకి వెళ్ళాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిందని అపర్ణ కోప్పడుతుంది. ఇక ఇంట్లో తాళాలు కూడా ఇచ్చేలా ఉన్నారని అపర్ణ అంటుంది.

టైం  వచ్చినప్పుడు అది కూడా జరుగుతుందని ఇందిరాదేవి అంటుంది. తను రాజ్ కి భార్య.. ఈ ఇంటికి కోడలు.. ఈ ఇంట్లో ఎక్కడికయినా వెళ్ళే హక్కు కావ్యకు ఉంటుందని అపర్ణకి ఎదురు మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి. చూసారా ఇంట్లోకి ఇలా అందరిని రానిస్తే.. ధాన్యలక్ష్మికి కూడా నేనంటే విలువ లేకుండా పోయిందని అపర్ణ అంటుంది. ఆ తర్వాత అందరూ టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. కావ్య టిఫిన్ రెడీ చేసిందని తెలిసి రాజ్ వెళ్తుంటే.. రాజ్ ని కూర్చొని తినమంటుంది ఇందిరాదేవి. ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరు కావ్యని తిట్టాలని.. రుద్రాణి రేఖ కలిసి ప్లాన్ చేస్తారు. కావ్య చేసిన చట్నీలో ఉప్పు ఎక్కువ వేస్తుంది రేఖ. ఇక అందరు టిఫిన్ చేస్తూ ఇంత ఉప్పా అంటూ కావ్య ఇలా చేశావేంటని అందరూ అంటారు. నీకు రాకుంటే వదిలేయ్ అన్నింట్లో తలదూర్చకు అని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు.

మరొకవైపు అప్పు టిఫిన్ చేస్తుంది. స్వప్నని పిలుచుకొని వస్తానని.. అప్పు ఆమె గదిలోకి వెళ్లేసరికి లోపల ఉండదు. స్వప్న లేకపోయేసరికి కనకంని పిలుస్తుంది అప్పు. ఆ తర్వాత తనతో స్వప్న మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది కనకం. ఇంకా ఎన్నిసార్లు మోసం చేస్తుందంటూ అప్పుతో కనకం అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.