Read more!

English | Telugu

నేనేమన్నా ఎర్రిపప్పనా..? మైక్ నేలకేసి కొట్టిన జానీ మాస్టర్!

జానీ మాస్టర్ ఎంతో కూల్ గా కనిపించే పర్సన్ అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటి జానీ మాస్టర్ కి బీభత్సమైన కోపం వచ్చేసింది..చేతిలో మైక్ విసిరేసి ఫుల్ ఫైర్ ఐపోయాడు..ఇంతకూ ఏమయ్యిందో చూద్దాం. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఢీ ప్రోమో రిలీజ్ అయ్యింది. అందులోనూ ఇది ఎలిమినేషన్ వీక్...సునంద, సాత్విక్ బాటమ్ టులో ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. ఐతే రాఖీ లేచి సునందకు ఓటేసినట్లు చెప్పాడు. ఐతే ఇక్కడ సాత్విక్ రాఖీ వైపు చూసి కళ్ళు ఆర్పి సునందకు ఓటేయమన్నట్టుగా ఒక సైగ చేసాడు.

దాన్ని జానీమాస్టర్ పసిగట్టాడు. "ఒకరికి ఒక పవర్ ఇచ్చినప్పుడు దాన్ని ఇంకొకరి మీద యూజ్ చేసేటప్పుడు ప్రోపర్ రీజన్ తో యూజ్ చేయాలి " అని  సీరియస్ గా చెప్పేసరికి రాఖీ లేచి "సాత్విక్ అన్నను చూసాను..ఆయన ఐకాంటాక్ట్ తో సునందకు ఓటేయమని" చెప్పాడు అంటూ నిజం చెప్పేసాడు. దాంతో జానీ మాస్టర్ కి కోపం నషాళానికి అంటేసింది. "నేనెందుకు ఇక్కడ కూర్చున్నది...నేనేమన్నా ఎర్రిపప్పనా" అంటూ మైక్ దించేసి లేచి సీరియస్ గా బయటకు వెళ్ళిపోయాడు. "ఢీ అంటే ఆటలాగా అనిపిస్తుందా మీకు...చెప్పరా..వాడు చెప్పాడంటే వీడు ఓటేశాడంటా. ఢీ ఎలా కనిపిస్తోంది...మాట్లాడాలన్నా కూడా లోపల నుంచి" అంటూ మైక్ విసిరి గొట్టాడు..మరి ఇదంతా ఏంటో అర్ధం కాక అందరూ షాకింగ్ లో ఉండిపోయారు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అంతా "జానీ మాస్టర్ కరెక్ట్ టైంలో రెస్పాండ్ అయ్యారు. వోటింగ్ ప్రాసెస్ మార్చేయండి." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.