Read more!

English | Telugu

రీతు చౌదరికి కొత్తగా బుగ్గలొచ్చాయంట.. మీకు తెలుసా!

వేసవి కాలం అంటే ఒక్కొక్కరికి ఒక్కో అనుభవం ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే స్కూల్స్ అయిపోయి అమ్మమ్మ గారింటికి వెళ్తుంటారు. అక్కడ అమ్మమ్మ చెప్పే కబుర్లు వింటు, అమ్మమ్మ చేసే వంటలు తింటు కాలక్షేపం చేస్తుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు.

రీతు చౌదరి పది రోజుల క్రితం వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళ అమ్మమ్మ చేసే రకరకాల పిండివంటలు తింటూ ఎంజాయ్ చేస్తుంది. అయితే వాటిని రోజుకో వ్లాగ్ చొప్పున యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది రీతు చౌదరి. అయితే తాజాగా తన యూట్యూబ్ లో ఓ మినీ వ్లాగ్ చేసింది. అందులో తను ఏం చెప్పిందంటే.. బాగా తిని బుగ్గలొచ్చాయని, తను అక్కడి నుండి రేపు వస్తున్నట్టుగా వీడియో చేసింది. ఇక వచ్చేముందు తన ఫేవరెట్ ఆమ్లెట్, టమాటా పికిల్ వేసుకొని తిని బజ్జుంటుందంట. ఇక హైదరాబాద్ కి వచ్చే ముందు తన ఫాలోవర్స్ తో కొన్ని విషయాలని షేర్ చేసుకుంది ‌. అమ్మమ్మ, నాన్నమ్మ తాతయ్యలతో హ్యాపీగా ఉండండి. ఐ లవ్ యూ గాయ్స్ అంటు రీతు చౌదరి ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.

రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. మరి మీలో ఎంతమంది రీతు చౌదరిని ఫాలో అవుతున్నారు. అయితే అమ్మమ్మ గారింట్లో మీ జ్ఞాపకాలని పంచుకోండి అంటూ తను చేసిన ఈ వ్లాగ్ ని చూశారా. చూడలేకపోతే ఓసారి చూసేయ్యండి.