Read more!

English | Telugu

వసుధారని రిషి ముద్దుపెట్టుకున్నాడా.. జయచంద్రకి పెరిగిన అనుమానం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -728 లో.. ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉంటే జయచంద్రకి అనుమానం వస్తుందని రిషి, వసుధార గది దగ్గరికి వెళ్తాడు. సర్ మీరు మళ్ళీ వచ్చారా అని అడుగుతుంది వసుధార. ఏ రాకూడదా అని రిషి అంటాడు. వసుధారకి దగ్గరగా రిషి వెళ్తుంటే.. ముద్దు పెట్టడానికి వస్తున్నాడేమో అనుకొని.. వసుధార కళ్ళు మూసుకుంటుంది. కానీ రిషి వసుధార పక్కన ఉన్న దిండుని తీసుకుంటాడు. ఇంతలోనే ధరణి వచ్చి రిషి నువ్వు ఇక్కడే పడుకుంటావా అని అడుగుతుంది. లేదు వదిన.. నా రూమ్ లో గాలి రావట్లేదు. అందుకే చల్లగాలి కోసం పైకి వెళ్తున్నానని రిషి చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు.

ఆ తర్వాత రిషి వెనకాల వసుధార వెళ్లి తన చున్నీతో గాలి విసురుతుంది. మీరు జయచంద్ర సర్ కి డౌట్ రావద్దని అలా చేస్తున్నారు కదా అని వసుధార అడగగానే.. నేను సమస్యని పెద్దగా చెయ్యద్దని అనుకొని అలోచించి ఇక్కడికి వచ్చాను అని రిషి అంటాడు. కాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రిషి నిద్రపోతాడు. ఉదయం లేచి రిషి, వసుధారలు జయచంద్రకి కాఫీ తీసుకొని వెళ్తారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో జయచంద్ర తన మాటల్లో వాళ్ళకి అర్థమయ్యేలా వివరిస్తాడు. ఆ తర్వాత రిషి, వసుధారలతో పాటుగా జయచంద్ర కాలేజీకి వెళ్తాడు. కార్ లో వెళ్తుంటే మాటి మాటికి రిషిని సర్ సర్ అనడం గమనించిన జయచంద్ర.. ఏంటమ్మా వసుధార.. రిషిని సర్ అని పిలవకు.. బంధంతో‌ పిలిస్తేనే ఆ బంధం బలపడుతుంది.. ఆ పిలుపు మార్చుకోమని అంటాడు. సరే సర్  నెక్స్ట్ టైం మారుస్తుందని రిషి అంటాడు. రిషి అలా అనేసరికి నిజంగానా సర్ అంటూ వసుధార ప్రేమగా రిషి చెయ్యి పట్టుకుంటుంది.

కాలేజీకి వెళ్ళాక జయచంద్ర దగ్గరికి జగతి వెళ్ళి.. సర్ మీరు రెండు జీవితాల మధ్య బంధాన్ని నిలబెట్టాలి.. రిషి నా కొడుకు.. వసుధార, రిషి లు భార్యాభర్తలు.. వాళ్ళిద్దరు చాలా మంచివాళ్ళని జయచంద్రకి జరిగిందంతా చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.