Read more!

English | Telugu

ఆమె ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేసిన రిషి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న  సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-697లో .. మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెడదామన్నారు. కానీ నేనే వద్దన్నాని వసుధర చెప్పగా.. ఎందుకు వద్దన్నావ్ అని రిషి అడుగుతాడు. ప్రెస్ మీట్ పెడితే మీరుండాలి కదా అని వసుధార అంటుంది. మన పర్సనల్ విషయాలకు‌ ప్రెస్ మీట్ ని ఆపేయడం కరెక్ట్ కాదని రిషి అంటాడు. దానికి సరే సర్ అని వసుధార సమాధానమిస్తుంది.

అక్కడే ఉన్న జగతి మహేంద్ర లు మిషన్ ఎడ్యుకేషన్ గురించి వసుధార చెప్పేది వింటారు. అప్పుడే గదిలోని దేవయాని వస్తుంది. అలా వచ్చాక.. "ఏంటి రిషికి బాగోలేదని తెలుసు కదా.. మీరంతా మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారేంటి? రిషికి రెస్ట్ ఇవ్వండి" అని అంటుంది. మహేంద్ర.. మనం బయటకు వెళ్దాం. రిషి వసుధార ఇద్దరు కలసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వసుధార వెళ్ళుంటే.. "థాంక్స్" అని రిషి చెప్పగా.. "రావడానికి సమయం‌ కావాలి.. మీరు ఒప్పుకోవాలి" అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి జరిగినదాని గురించి ఆలోచిస్తుంటాడు. 

వసుధార కాలేజీలో ప్రెస్ మీట్ కి వెళ్తుండగా.. రిషి సర్ కి ఎలా ఉందోనని ఆలోచించుకుంటూ వెళ్తుంది. లోపలికి వెళ్ళాక రిషిని చూసి కోప్పడుతుంది. జ్వరం వచ్చింది కదా ఎందుకు వచ్చారు? అని వసుధార అడుగగా.. మిషన్ ఎడ్యుకేషన్ గురించి అని రిషి చెప్పగా.. ఇంటికి వెళ్ళండని దబాయించి మాట్లాడుతుంది. రిషి క్యాబిన్ బయట ఇద్దరు టీచర్స్ రిషి, వసుధారల గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. అప్పడే బయటకు వచ్చిన రిషి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటాడు. ఆ ఇద్దరిని రిషి తన క్యాబిన్ లోకి రమ్మని చెప్తాడు. ఆ తర్వాత జగతి మేడమ్ ని రమ్మని చెప్తాడు. జగతి మేడం వచ్చాక.. ఆమె ముందే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తాడు. "వీళ్ళు కాలేజీలో పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. వీళ్ళు పద్దతి మార్చుకోలేదు. సో డిస్మిస్ చేస్తున్నాను" అని చెప్తాడు. అలా చెప్పేసి వెళ్ళిపోతుండగా.. ఆ టీచర్స్ ఇద్దరు రిషిని రిక్వెస్ట్ చేస్తే..  "జగతి మేడంతో మాట్లాడుకోండి" అని చెప్పేసి రిషి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇది రిషి సర్ నిర్ణయం.. నా చేతుల్లో ఏమీ లేదని వాళ్ళిద్దరితో జగతి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.