English | Telugu

సుదీర్‌, రష్మీలపై నరేష్ కామెంట్స్..పళ్ళు రాలగొట్టిన రాంప్రసాద్


శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సమ్మక్క సారక్క కాన్సెప్ట్ తో రాబోతోంది. ఇక ఇందులో రష్మీ పెళ్లి విషయం బాగా హైలైట్ అయ్యింది. నాటీ నరేష్ సోదెమ్మ గెటప్ లో వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసాడు. "సోది సెబుతానమ్మా సోది" అంటూ వచ్చేసరికి రష్మీ "సూదమ్మ సూదమ్మా" అని పిలిచింది. "సూదమ్మా దారమమ్మా కాదె సోదెమ్మ" అంటూ కరెక్ట్ చేసాడు నరేష్. తర్వాత తన అరచేతిని చూపించి "నా పెళ్లెప్పుడవుతది" అని అడిగింది. "నీకు కాబోయే వాడు మహరాజులా ఉంటాడు. రాత్రయితే ఎవరికీ కనపడడు. జేబులో నుంచి పావురాలను తీస్తాడు. రాత్రయితే ఆ పావురాలను మంచింగ్ కి వాడుకుంటూ ఉంటాడు. నాకెందుకో వాడు కాకుండా ఇంకెవడో ఉన్నాడనిపిస్తుంది భవిష్యత్తులో" అని నరేష్ రష్మీ అరచేతిని చూసి జాతకం చెప్పాడు. దానికి రష్మీ తెగ సిగ్గుపడుతూ నవ్వేసింది. తర్వాత రష్మీ సీరియస్ గా "కొంతమంది చాల ఎక్స్ట్రాలు చేస్తున్నారు అందుకే నేను వాళ్ళ పళ్ళు రాలకొడదామనుకుంటున్నా" అంటూ రాంప్రసాద్ వైపు చూస్తూ చెప్పింది.

తర్వాత రాంప్రసాద్, నటీ నరేష్ చిత్రపటాలని ఏర్పాటు చేసి అందులో వాళ్ళ నోట్లో పళ్ళను రాళ్లతో కొట్టేలా ఒక ఫన్నీ గేమ్ ఆడింది, ఆడించింది. తర్వాత రష్మీ, ఇంద్రజ పళ్ళను రాంప్రసాద్ రాలగొట్టాడు. తర్వాత "జయహో భారత్..జై జవాన్ " పేరుతో ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అందులో సింధూర్ ఆపరేషన్ లో ఒక పార్టిసిపేట్ చేసిన ఒక జవాన్ కూడా ఈ స్టేజి మీదకు వచ్చాడు. అదిరే అభి టీమ్ అంతా కలిసి ఒక టాస్క్ చేశారు. ఇలా ఈ వారం ఈ ఎపిసోడ్ ఎంటర్టైన్ చేయబోతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.