English | Telugu

హైపర్ ఆది మాకు గాడ్‌.. దొర‌బాబు భార్య కామెంట్‌!

'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన చేసే కామెడీ, వేసే పంచ్ లు అతడికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చాయి. బుల్లితెరపై తనదైన కామెడీతో హల్చల్ చేస్తోన్న హైపర్ ఆది.. తన షోలలో మహిళలను, లేడీ యాంకర్స్ ను టార్గెట్ చేస్తూ పంచ్ లు వేస్తుంటాడు. ఒక్కోసారి ఈ పంచ్ లు శృతి మించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే హైపర్ ఆది టీమ్ లో పని చేసే దొరబాబు, పరదేశీ అనే ఇద్దరు కమెడియన్లు గతంలో వ్యభిచారం కేసులు పట్టుబడిన సంగతి తెలిసిందే.

అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సంఘటన జరిగి ఏడాది దాటేసినా.. ఇప్పటికీ హైపర్ ఆది తన స్కిట్ లలో వారిని ఉద్దేశిస్తూ పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ షోలో దొరబాబు తన భార్య అమూల్యతో కలిసి కనిపించాడు. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించిన సుడిగాలి సుధీర్.. దొరబాబుని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని అతడి భార్యని అడగగా.. తన ఇంట్లో వాళ్ళు దొరలాంటి వాడిని పెళ్లి చేసుకోమని చెబితే.. దొరలాంటి వాడు ఎందుకని దొరబాబునే పెళ్లి చేసుకున్నానంటూ పంచ్ వేసింది.

ఇది విన్న హైపర్ ఆది.. 'నీకు టిక్ టాక్ లో అంత ఫాలోయింగ్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్ధమైంది' అంటూ కౌంటర్ వేశాడు. ఇక ఆ తరువాత అమూల్య మాట్లాడుతూ.. 'మేము కష్టాలలో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోలేదు. ఇక మాకెవరూ లేరని అనుకున్న సమయంలో హైపర్ ఆది ముందుకొచ్చారు. మాకు సాయం చేసి ఆదుకున్నారు. అందుకే ఆయన నెంబర్ ను మా ఫోన్ లో గాడ్ అని సేవ్ చేసుకున్నాం' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.