English | Telugu

సుత్తికొట్టే సుధీర్‌.. రెచ్చ‌గొట్టే ర‌ష్మీ!

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది జ‌బ‌ర్ద‌స్త్‌. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకడు. తనదైన పంచ్ లతో హడావిడి చేసే ఈ కమెడియన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా సుడిగాలి సుధీర్, రష్మీల రిలేషన్ పై అత‌ను వేసిన పంచ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రతి గురువారం ప్రసారమయ్యే 'జబర్ద‌స్త్‌' షోలో హైపర్ ఆది టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విషయం తెలిసిందే.

అలానే అప్పుడప్పుడు 'ఎక్స్‌స్ట్రా జబర్ద‌స్త్‌' షోలో ఇతర టీమ్స్ లో గెస్ట్ రోల్ చేస్తుంటాడు హైపర్ ఆది. ఇప్పుడు రాకింగ్ రాకేష్ టీమ్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వచ్చే వారం ప్రసారం కానున్న ఈ షోలో హైపర్ ఆది కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఎప్పటిలానే తన కామెడీతో ఎంటర్టైన్ చేసిన హైపర్ ఆది.. జడ్జ్ మనోతో కలిసి ఓ స్కిట్ చేశాడు.

ఆ సమయంలో ఆయనపై పంచ్ ల వర్షం కురిపించాడు. 'మరగబెట్టే మనో.. ఇరగదీసే ఇంద్రజ' అంటూ మీరు కూడా ఓ టీమ్ పెట్టాల్సిందని జడ్జ్ లకు షాకిచ్చాడు. జడ్జ్ ల టీమ్ పేరు చెప్పగానే.. యాంకర్ రష్మీ 'హలో హలో మరి నాకేం టీమ్ లేదా?' అని ప్రశ్నించింది. దానికి వెంటనే స్పందించిన హైపర్ ఆది 'నీకెందుకు లేదు.. సుత్తికొట్టే సుధీర్.. రెచ్చగొట్టే రష్మీ' అంటూ పంచ్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.