English | Telugu

యూకేలో కౌశల్ భార్య ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే..!

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్.. ఇటీవల తన భార్య నీలిమ ఆరోగ్యానికి సంబంధించి ఓ పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్ ను బట్టి నీలిమ ఆరోగ్య పరిస్థితి దెబ్బ తిందని అర్ధమైంది. అయితే వీటిపై క్లారిటీ ఇస్తూ నీలిమ స్వయంగా ఓ వీడియో విడుదల చేసింది. పిల్లలు, భర్తకు దూరంగా లండన్ లో ఉద్యోగం చేస్తున్న నీలిమ కోవిడ్ బారిన పడింది. అయితే లండన్ లో ట్రీట్మెంట్ సరిగ్గా చేయడం లేదని తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ వీడియో రిలీజ్ చేసింది నీలిమ.

ఇందులో ఆమె పలు విషయాలను వెల్లడించింది. తనకు కోవిడ్ వచ్చి ఏడు రోజులు అవుతోందని.. ప్రస్తుతం తను యూకేలో ఉన్నానని.. యూకే సేఫ్ కంట్రీ కదా ఇక్కడ కేసులు లేవనుకున్నానని.. కానీ తనకు వర్క్ చేసే ప్లేస్ నుండి కోవిడ్ సోకిందని చెప్పింది. ఇండియాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని.. అయితే అక్కడి కంటే యూకేలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పింది నీలిమ. తనకు కోవిడ్ వచ్చిన తరువాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడ్డానని.. ఆ సమయంలో ఎన్ హెచ్ ఎస్ వాళ్లకు చెబితే వాళ్లు పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి ఊరుకున్నారని.. ట్రీట్మెంట్ చేయలేదని తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది.

యూకే గురించి గొప్పగా ఊహించుకున్నానని.. కానీ ఏం లేదని.. ఇండియాలో చిన్న ప్రాబ్లెమ్ ఉందని చెప్పినా .. ఎంతో బాగా స్పందిస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. నెగెటివ్ రాగానే ఇంటికి రావాలనిపిస్తుందని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన నీలిమ‌, "పిల్ల‌ల్ని వ‌దిలి రావ‌డ‌మంటే ఈ భూమ్మీద న‌ర‌కం లాంటింది." అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.