Read more!

English | Telugu

సుధీర్ ఎంత మంచోడంటే.. ఆ తల్లీకూతుళ్లను క్యారవాన్ లోకి పిలిచి...

జబర్దస్త్ అంటే చాలు ముందుగా మనకు గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శీను...వీళ్ళ ముగ్గురూ మంచి కమెడియన్స్ మాత్రమే కాదు మంచి ఫ్రెండ్స్ కూడా. ఈ ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల నజరానా ఉంటుంది. ఆడియన్స్ కూడా వీళ్ళ షో కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ ముగ్గురు గురించి జబర్దస్త్ గడ్డం నవీన్ ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పాడు. 

"జబర్దస్త్ అనే వేదిక లేకపోతే ఈ రోజు సుధీర్ అనే స్టార్ లేడు.. వేదిక ఉంటేనే సరిపోదు కదా ఆయన కూడా చాలా కష్టపడి పైకొచ్చాడు. ఓవర్ నైట్ లో అతనికి పేరు రాలేదు... సుధీర్ అంటే చాలా ఇన్స్పిరేషన్ ఎంతో మందికి. మ్యాజిక్ చేసుకుంటూ ఉండే సుధీర్ అంత స్టార్ ఐనా కూడా తన మీద ఎవరు పంచులు వేసినా చాలా కూల్ గా తీసుకుంటాడు. నా మీద పంచులు వేయొద్దు అని చీదరించుకోవడం వంటివి అస్సలు చేయడు. అతను ఎంత మంచివాడో చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. ఒకసారి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్  జరుగుతోంది..అక్కడికి ఒక తల్లీ కూతురు వచ్చారు. ఐతే నా షూటింగ్ టైంకి నేను అక్కడికి వెళ్లేసరికి వాళ్ళ ఇద్దరూ ఏడుస్తూ కనిపించారు. ఏమిటి అని అడిగితే  సుధీర్ తో ఫోటో దిగడానికి వచ్చారట. ఐతే ఆ విషయం ఇంకా సుధీర్ కి తెలీదు. నేను క్యారవాన్ లోకి వెళ్లి హైపర్ ఆదితో చెప్పా..తర్వాత పర్సనల్ గా నేను కూడా సుధీర్ కి  చెప్పేసరికి వెంటనే ఆ తల్లీ కూతుళ్లను క్యారవాన్ లోకి పిలిపించి వాళ్లకు ఒక సెల్ఫీ ఇచ్చాడు సుధీర్ .. అంత మంచోడు. అలా ఆయన విషయంలో ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అందుకే ఆయనకు లేడీ ఫాన్స్ చాలా ఎక్కువ. అందుకే సుధీర్ అంటే ఒక బ్రాండ్..బుల్లితెర పవన్ కళ్యాణ్ అని పిలుచుకుంటాం. అలాగే గెటప్ శీనుని బుల్లితెర కమలహాసన్ అని పిలుచుకుంటాం. చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆయనతో కలిసి ఫ్లయిట్ లో వెళ్లడం శీను చేసుకున్న అదృష్టం. ఇక రాంప్రసాద్ ఒక్కసారి మొదలుపెడితే అలా ఇన్స్టంట్ గా రాస్తూనే ఉంటాడు....వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎప్పుడూ ఎలాంటి గొడవలు కూడా ఉండవు...ఫ్రెండ్ షిప్ అంటే అలా ఉండాలి" అనిపిస్తుంది అంటూ ఆ ముగ్గురు మిత్రుల గురించి చెప్పాడు నవీన్.