English | Telugu

'జబర్దస్త్' పేరుతో మోసాలు.. వార్నింగ్ ఇచ్చిన కమెడియన్!

బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతోంది 'జబర్దస్త్'. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు గుర్తింపు లభించింది. ఆర్థికంగా కూడా ఈ షో చాలా మందిని ఆదుకుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో కూడా రాణిస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే ఈ షో పేరుని వాడుకుంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై కమెడియన్ రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మొదట్లో చిన్నపిల్లలతో ఎక్కువగా స్కిట్ లు చేసిన రాకేష్.. ఆ తరువాత నటి రోహిణితో ఎక్కువగా స్కిట్లు చేస్తున్నాడు. అయితే తాజాగా రాకేష్ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో 'జబర్దస్త్' పేరుతో మోసాలు చేస్తున్నారని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 'జబర్దస్త్' షోలో అవకాశం వస్తుందని ఆశపడి.. మోసగాళ్ల మాటలు నమ్ముతున్నారని చెప్పాడు.

'జబర్దస్త్' షో అవకాశం కావాలంటే ఎవ‌రికి వారే వెతుక్కోవాలని.. ఈ షోలో అవకాశాలు ఇచ్చేవాళ్లు డబ్బులు వసూలు చేయరనే విషయాన్ని గుర్తించుకోవాలని రాకేష్ తెలిపాడు. రాకేష్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ 'చంటబ్బాయ్'లో ఈ వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది తన పేరు వాడుకొని పెద్ద మొత్తంలో డబ్బుని వసూలు చేశారని.. ఇకపై అలా ఎవరైనా చేస్తే దయచేసి తనకు కామెంట్ల రూపంలో తెలియజేయాలని అత‌ను కోరాడు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.