Read more!

English | Telugu

వేలు స్వామికి కరువు ఎక్కువ...ఏపీ రాజకీయాలపై జాతకం!

ఉగాది పండగ మరో నాలుగు రోజుల్లో రాబోతోంది. ఇక బుల్లితెర మీద ఎన్నెన్నో కార్యక్రమాలు.. ఇప్పుడు జీ తెలుగులో ఫామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం పేరుతో ఒక ఈవెంట్ రాబోతోంది. ఈ షోకి వరుణ్ సందేశ్-వితికా షేరు హోస్ట్స్ గా చేస్తున్నారు. బుల్లితెర నటీనటులతో పాటు దిల్ రాజు, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, రాసి, సితార, ఆలీ వంటి వాళ్లంతా ఎంట్రీ ఇచ్చారు. ఇక మన బిత్తిరి సత్తి ఐతే వేణు స్వామిగా కనిపించాడు. అతను ఎలాంటి కాస్ట్యూమ్ ఐతే వేసుకుంటాడో అలాంటిదే వేసుకుని వచ్చాడు..సత్తి రాగానే జోకులే జోకులు. "నా పేరు వేలు స్వామి" అంటూ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు." ఆలీ గారు ఏపీలో ఎం జరగబోతోందో నేను చెప్తా" అనేసరికి " ఎం జరగబోతోంది" అని ఆలీ అడిగాడు. "ఏపీలో నెక్స్ట్ మేలో ఎండలు ఇంకా పెరగబోతున్నాయి" అని చెప్పాడు. అది కూడా గ్యాప్ ఇస్తూ ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే కానీ ఆ విషయం చెప్పకుండా ఎండలు అంటూ టాపిక్ డైవర్ట్ చేసాడు. తర్వాత ఇంటింటి  గృహలక్ష్మి కస్తూరికి  జాతకం చెప్పాడు "మీరు హీరోయిన్ గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది" అని చెప్పేసరికి "హీరోయిన్ గానా నటించిన సినేమానా " అని కస్తూరి డౌట్ గా అడిగింది."ఇదిగో ఇన్ని సినిమాలు రి-రిలీజ్ అవుతున్నాయి మీ అన్నమయ్య రీరిలీజ్ కాదా" అనేసరికి హర్ట్ అయ్యి స్టేజి మీద నుంచి లేచి వెళ్ళిపోయింది. "రాశికి రాశి ఫలాలు చెప్పబడును" అని చెప్పాడు "2020 లోనే ఒక ప్రముఖ హీరో మీద చెయ్యేసుకుంటారు" అని చెప్పా.."అయ్యో నేను అలాంటి దాన్ని కాదు." అని బాధపడిపోయింది రాశి. చూడండి అంటూ చూపించాడు..ఇంతకు ఎం చూపించాడో తెలియాలంటే ఈ షో వరకు వెయిట్ చేయాల్సిందే.