Read more!

English | Telugu

Karthika Deepam2 : తల్లి కూతుళ్లు ఒక్కటవుతారా.. కార్తిక్ ని అపార్థం చేసుకున్న దీప!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఇది నవ వసంతం.ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో.. నరసింహని ఇంకొక భార్యతో చూసిన దీప షాక్ అవుతుంది. ఎందుకు ఇలా అన్యాయం చేసావంటూ నర్సింహని దీప నీలదీస్తుంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు.. నాకు నీపై ఇష్టం కలిగిన రోజు ఒక రోజు వచ్చి వెళ్తానని నరసింహ అనగానే.. దీపకి కోపం వస్తుంది. నువ్వు నా మొగుడు అయి బ్రతికిపోయావ్ ? లేదంటే నీ సంగతి చెప్పేదాన్ని ఎన్నో ఆశలతో వచ్చాను కానీ ఇలా చేస్తావనుకులేదని దీప అంటుంది.

ఇక నుండి నా బిడ్డకు తల్లిని అయిన తండ్రిని అయినా నేనే.. నీ నీడ కూడ నా బిడ్డపై పడడానికి వీలు లేదని నర్సింహకి దీప చెప్తుంది. వాళ్ళ మాటలని నర్సింహా రెండో భార్య వింటుంది. మరొకవైపు దూరంగా ఉన్న శౌర్య మాత్రం.. నా వల్ల మా అమ్మతో గొడవ పడుతున్నారని అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్యని తీసుకొని దీప అక్కడ నుండి వస్తుంది.‌ మరొకవైపు కార్తీక్ దార్లో వెళ్తూ వెళ్తూ.. దీప గురించి ఆలోచిస్తుంటాడు. వాళ్ళ కుటుంబం పాపం ఆర్థికంగా బాగా లేరనిపిస్తుంది. ఈసారి ఊరు వెళ్ళినప్పుడు కచ్చితంగా దీపని కలవాలని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే పరధ్యానంలో ఉన్న కార్తిక్.. ఏదో ఆలోచిస్తు వెళ్తున్న దీప, శౌర్య లకి దగ్గరకి వెళ్ళేసరికి బ్రేక్ వేస్తాడు. వెంటనే కార్ దిగి చూస్తే దీప ఉంటుంది. తనని చూసిన కార్తీక్ షాక్ అవుతాడు. దీప కార్తీక్ తో కోపం గా మాట్లాడి వెళ్ళిపోతుంది. నా టైమ్ ఏంటి ఇలా ఉంది.. మొన్నటి వరకు మనిషిలాగా అయినా చూసేది.. ఇప్పుడు అలా అయిన చూడట్లేదని కార్తీక్ బాధపడతాడు.

ఆ తర్వాత అతను మన ఊళ్ళో సైకిల్ ప్రైజ్ గా ఇచ్చాడు కదా అసలు తెలియనట్టు బెహేవ్ చేస్తున్నాడని దీపతో శౌర్య అనగానే.. కార్తీక్ పై దీప ఇంకా కోపం పెంచుకుంటుంది. ఆ తర్వాత సుమిత్ర గుడిలో అన్నదానం చేయిస్తుంది. అప్పుడే దీప, శౌర్యలు గుడికి వెళ్తారు. వాళ్ళని చూస్తుంది సుమజత్ర. సుమిత్రకి దీపని చూసాక ఏదో తెలియని ఫీలింగ్.. ఎక్కడో చూసాను కానీ గుర్తుకు రావడం లేదని సుమిత్రతో దీప అంటుంది. మీరు కూర్చోండి భోజనం పెడతానని దీపతో సుమిత్ర అంటుంది. వాళ్ళ పేర్లు అడిగి తెలుసుకుంటుంది సుమిత్ర. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.