English | Telugu

ముమైత్‌కు ఓంకార్ వార్నింగ్‌!

ముమైత్‌ఖాన్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క్రేజ్ త‌గ్గిపోవ‌డం ఓ కార‌ణం కాగా... అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం.. ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా ఆమె సినిమాల్లో న‌టించ‌ట్లేదు. బాల‌కృష్ణ మూవీ‌ 'డిక్టేట‌ర్‌' త‌రువాత ముమైత్ చాలా వ‌ర‌కు సినిమాల్లో క‌నిపించ‌డం మానేసింది.

అయితే తాజాగా ఓంకార్ మ‌ళ్లీ మొద‌లుపెట్టిన `డ్యాన్స్ ప్ల‌స్‌` షోలో న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముమైత్‌తో పాటు య‌ష్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, యానీ మాస్ట‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ కూడా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అద్భుత‌మైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఈ షో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ప్ర‌తి శని, ఆదివారాలు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోకి రేటింగ్ బాగానే వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ వారానికి సంబంధించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ముమైత్ ఖాన్ ... స‌హ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యానీ మాస్టర్‌ని మైండ్ గేమ్ ఆడుతున్నావ‌ని ఇరుకున పెట్ట‌డం.. ఇలా అంటే తాను షో నించి వెళ్లి పోతాన‌ని యానీ మాస్ట‌ర్ అంటే "వెళ్లిపో.." అని ముమైత్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంభాష‌ణ అంతా గ‌మ‌నించి ఓంకార్ "ఎందుకు మీరు ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? .. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డ్యాన్స్ చేసిన వారికి రెడ్ ఇవ్వ‌డం.. మిస్టేక్‌లు చేసిన వారికి గ్రీన్ ఇవ్వ‌డం ఎందుకు చేస్తున్నారు.. మీ ప‌ద్ద‌తి ఏమీ బాగాలేదు." అ‌ని ఓంకార్.. ముమైత్‌కు వార్నింగ్ ఇచ్చేంత ప‌ని చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముమైత్ షోలో కొన‌సాగుతుందా?.. లేక బ‌య‌టికి వెళ్లిపోతుందా? అన్న‌ది తెలియాలంటే ఈ వీకెండ్ లో ప్ర‌సారం అయ్యే 'డ్యాన్స్ ప్ల‌స్‌' షో చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.