English | Telugu

ముమైత్‌కు ఓంకార్ వార్నింగ్‌!

ముమైత్‌ఖాన్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. క్రేజ్ త‌గ్గిపోవ‌డం ఓ కార‌ణం కాగా... అవ‌కాశాలు ఇచ్చేవాళ్లు లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం.. ఆరోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా ఆమె సినిమాల్లో న‌టించ‌ట్లేదు. బాల‌కృష్ణ మూవీ‌ 'డిక్టేట‌ర్‌' త‌రువాత ముమైత్ చాలా వ‌ర‌కు సినిమాల్లో క‌నిపించ‌డం మానేసింది.

అయితే తాజాగా ఓంకార్ మ‌ళ్లీ మొద‌లుపెట్టిన `డ్యాన్స్ ప్ల‌స్‌` షోలో న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముమైత్‌తో పాటు య‌ష్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, యానీ మాస్ట‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ కూడా న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అద్భుత‌మైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఈ షో విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ప్ర‌తి శని, ఆదివారాలు రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న ఈ షోకి రేటింగ్ బాగానే వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ వారానికి సంబంధించిన ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ముమైత్ ఖాన్ ... స‌హ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యానీ మాస్టర్‌ని మైండ్ గేమ్ ఆడుతున్నావ‌ని ఇరుకున పెట్ట‌డం.. ఇలా అంటే తాను షో నించి వెళ్లి పోతాన‌ని యానీ మాస్ట‌ర్ అంటే "వెళ్లిపో.." అని ముమైత్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సంభాష‌ణ అంతా గ‌మ‌నించి ఓంకార్ "ఎందుకు మీరు ఏక ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? .. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డ్యాన్స్ చేసిన వారికి రెడ్ ఇవ్వ‌డం.. మిస్టేక్‌లు చేసిన వారికి గ్రీన్ ఇవ్వ‌డం ఎందుకు చేస్తున్నారు.. మీ ప‌ద్ద‌తి ఏమీ బాగాలేదు." అ‌ని ఓంకార్.. ముమైత్‌కు వార్నింగ్ ఇచ్చేంత ప‌ని చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ముమైత్ షోలో కొన‌సాగుతుందా?.. లేక బ‌య‌టికి వెళ్లిపోతుందా? అన్న‌ది తెలియాలంటే ఈ వీకెండ్ లో ప్ర‌సారం అయ్యే 'డ్యాన్స్ ప్ల‌స్‌' షో చూడాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.