English | Telugu

ఇంట్లో ఎవరూ లేరు ర‌మ్మ‌న‌మ‌ని సుధీర్‌కు రష్మీ ఫోన్ చేస్తే...

సుధీర్‌కి రష్మీ ఫోన్ చేసింది. ప్రేమగా 'అరే... ఎం చేస్తున్నావ్?' అని అడిగింది. 'ఏం చేయడం లేదు. ఖాళీగా ఉన్నాను' అని చెప్పాడు. అప్పుడు 'అరే... ఇంట్లో ఎవరూ లేరు' అని చెప్పింది. ఇంటికి రమ్మని హింట్ ఇచ్చింది. అయితే సుధీర్ ఏమీ తెలియనట్టు అమాయకుడిగా నాకెందుకు ఫోన్ చేశావ్ అన్నట్టు అడిగాడు. 'ఎదవ సోది ఆపి ఇంటికి రా' అని రష్మీ ఆర్డర్ వేసింది. వాయిస్‌లో బేస్ పెంచింది. మామూలుగా అయితే ఎప్పుడూ రష్మీకి లైన్ వేసే సుధీర్, తన ఇమేజ్‌కు భిన్నంగా ప్రవర్తించాడు.

'ఇంటికా? రష్మీ.. ప్లీజ్ రష్మీ. నన్ను వదిలేయ్. మాటొస్తే ఇంటికి రా.. ఇంటికి రా అని ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావ్.' అని సుధీర్ అన్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ పగలబడి నవ్వారు. ఊహించని సమాధానంతో రష్మీ నోరెళ్లబెట్టింది. అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ బుధవారం టెలికాస్ట్ కాబోయే 'ఢీ' ఎపిసోడ్‌లో చూడాలి.

సుధీర్‌కి రష్మీ ఫోన్ చేయడం మాత్రమే కాదు... ఆదికి దీపిక కూడా ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పక ముందే 'మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదు గానీ... తొందరగా కానిచ్చేద్దాం' అని ఆది రిప్లై ఇచ్చాడు. 'నాన్నగారు ఇంట్లో లేరు, ఇంటికి వస్తావా?' అని అడిగితే 'వెంటనే ఇంటికి వస్తా' అన్నాడు. మొత్తం మీద ప్రోమో కామెడీతో, కలర్‌ఫుల్ డాన్స్‌లతో సాగింది. ఒక కంటెస్టెంట్‌తో రష్మీ డాన్స్ చేయడం విశేషం.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.