English | Telugu

Karthika Deepam 2: జ్యోత్స్నకి పారిజాతం వార్నింగ్.. కాంచన రిపోర్ట్స్ లో ఏం ఉందంటే..?

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -556 లో... జ్యోత్స్న వల్లే కాశీ స్టేషన్ కి వెళ్ళాడని పారిజాతానికి కోపం వస్తుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారిజాతం. గర్వం తలకి ఎక్కితే పర్వాలేదు కానీ ఒళ్ళంతా విషంలాగా మారిందని తనపై కోప్పడుతుంది పారిజాతం‌. అసలు ఇందులో కాశీని కావాలనే ఇరికించింది బావ. కాశీని పోలీసులు అరెస్ట్ చేయకుండా బావ చేయొచ్చు.. వాళ్లని ఆపొచ్చు కానీ బావ అలా చెయ్యలేదని పారిజాతాన్ని జ్యోత్స్న డైవర్ట్ చేస్తుంది.

ఆ తర్వాత శ్రీధర్ భోజనానికి వస్తున్నాడని అనసూయ అన్ని రెడీ చేస్తుంది. శ్రీధర్ గారు రావడం ఒక్కటే లేటు అని కాంచనతో అనసూయ అంటుంది. నాతో మీ నాన్నగారు అంటావ్.. దీపతో మావయ్యగారు అంటావ్.. మా అమ్మతో మాత్రం శ్రీధర్ గారు అని ఎందుకు అంటావని కార్తీక్ అంటాడు‌. ఏం అంటార్ దీప అని కార్తీక్ అనగానే.. మీ ఆయన అనాలని దీప చెప్తుంది. పిల్లల కోసం పారుని పెళ్లి చేసుకున్నాడు తాత. నా కోసం నువ్వు నాన్నతో భార్యగా ఉండలేవా అని కార్తీక్ అంటాడు.

అప్పుడే శ్రీధర్, కావేరి, స్వప్న ఎంట్రీ ఇస్తారు. సారీ పెద్దమ్మ ఇన్ని ప్రాబ్లెమ్స్ కి కారణం నేనే అని స్వప్న అనగానే నువ్వు ఏం చేసావని కాంచన అడుగుతుంది. కాశీని పెళ్లి చేసుకున్నాను కదా.. ముఖ్యంగా నా వల్ల దీప వదిన ఎక్కువ బాధపడిందని స్వప్న అంటుంది.

మరొకవైపు సుమిత్రకి కాళ్ళునొప్పులు ఉన్నాయని దశరథ్ కాళ్ళు మసాజ్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేస్తాడు. దాంతో దశరథ్ పక్కకి వెళ్లి మాట్లాడుతాడు. రేపు వచ్చి రిపోర్ట్స్ తీసుకోండి అలాగే డాక్టర్ మీతో మాట్లాడతారని చెప్పగానే ఏమైందో ఏమోనని దశరథ్ కి ఇంకా టెన్షన్ అవుతుంది.

మరొకవైపు అందరు భోజనం చేస్తుంటారు. అసలు కాశీ అలా అవ్వడానికి కారణం మీరేనని శ్రీధర్ తో కాంచన అంటుంది. మీరు మావయ్యగా వాడి మీద అధికారం చెలాయించాలనుకున్నారు.. వాడికి ఎలా ఉంటుందని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.