English | Telugu

Brahmamudi: రేణుక మాటలతో ఆలోచనలో పడ్డ ధాన్యలక్ష్మి.. కావ్య బిజినెస్ మైండ్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -913 లో... గుడిలో అన్నదానం చేస్తానని పంతులికి ధాన్యలక్ష్మి డబ్బులు ఇస్తుంటే.. నువ్వు అన్నదానం చేయడం అత్తగారిగా నాకు ఇష్టం లేదని ఇందిరాదేవి అంటుంది. చేసేది మంచి పని అయినప్పుడు అందరికి నచ్చాల్సిన అవసరం లేదని ధాన్యలక్ష్మి అంటుంది. అయితే నీ కోడలు చేసింది తప్పని నీకెలా అనిపిస్తుంది, తను ఒక తల్లి బిడ్డని కాపాడిందని ఇందిరాదేవి అంటుంది.

దాంతో నేను చేసేది మీకు నచ్చలేదని అంటున్నారు కాబట్టి చెయ్యను అది కోడలుగా మీకు నేను ఇస్తున్న గౌరవం అని ధాన్యలక్ష్మి అంటుంది. పంతులు గారు ఇక నుండి అన్నదానం చెయ్యనని ధాన్యలక్ష్మి చెప్పి పంతులిని పంపిస్తుంది.

ఆ తర్వాత పంతులు గారు పిన్ని కోరుకున్నట్లు అన్నదానం జరిపించండి.. డబ్బులు నేను పంపిస్తానని పంతులికి చెప్పి పంపిస్తాడు రాజ్. కాసేపటికి అదేంట్రా ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందని రాజ్ అంటాడు.

మరొకవైపు రాహుల్ కంపెనీకి వచ్చిన క్లయింట్స్ అందరు కావ్య డిజైన్స్ నచ్చి వెళ్లిపోతున్నారని రాహుల్ కి మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు. దాంతో రాహుల్ కోపంగా ఉంటాడు. అప్పుడే రుద్రాణి వచ్చి రాజ్ బిజీగా ఉన్నాడు కాబట్టి అప్పుడు అలా సక్సెస్ అయ్యావ్.. ఇప్పుడు అలాగే చేసి మళ్ళీ నీ రూట్ క్లియర్ చేసుకోమని రుద్రాణి చెప్తుంది.

ఆ తర్వాత పాపని తీసుకొని ఇంటికి వస్తుంది రేణుక. అప్పు మేడమ్ వల్లే నా కూతురు నా దగ్గరికి వచ్చింది.. అలాంటి అప్పు మేడమ్ మీకు కోడలిగా వచ్చిందంటే మీ అదృష్టం అని ధాన్యలక్ష్మితో అప్పు గురించి రేణుక గొప్పగా చెప్తుంది. అక్క నీలాగే నేను పోలీస్ అవుతానని పాప చెప్తుంటే.. ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత ఏంటి ధాన్యం, అప్పు విషయంలో నిర్ణయం మార్చుకోలేకపోతున్నావా అని తనని మార్చాలని ప్రకాష్ ట్రై చేస్తాడు.

ఆ తర్వాత క్లయింట్స్ అందరు మన కంపెనీకీ వచ్చారని రాజ్ కి శృతి ఫోన్ చేసి చెప్తుంది‌. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను ఒకసారి వాళ్లతో మాట్లాడాలి, మళ్ళీ ఇంకొకసారి వేరొక కంపెనీకి పోరని గ్యారెంటీ లేదని కావ్య అనగానే.. బిజినెస్ లో నన్ను మించి పోయావని కావ్య గురించి రాజ్ గొప్పగా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.