Read more!

English | Telugu

Brahmamudi : జ్యూస్ లో మత్తు మందు కలిపిన రుద్రాణి... ఆ బిడ్డకి తల్లి ఎవరు?

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -385 లో..రాజ్ ఆదమరిచి కావ్యపై ప్రేమని చెప్తుంటాడు. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది.. నా కుటుంబాన్ని బాగా చూసుకుంటుందంటూ కావ్యపై ప్రేమ ని చెప్తుంటే.. కావ్య ఇంప్రెస్ అవుతుంది. నా భార్యపై ప్రేమని చెప్పేకంటే చూపించడం బెటర్ అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ వెంటనే అక్కడ నుండి పక్కకి వస్తాడు. మీరు ఇప్పటివరకు చెప్పింది అంతా నిజం అయితే బాగుండనిపిస్తుందని రాజ్ తో కావ్య అంటుంది.

మీరు ఇప్పటివరకు నిజంగా నాపై ప్రేమ ఉందని అనేట్టుగా మాట్లాడారు కానీ అది అబద్ధం అనుకోవాలా? ఏం అనుకోవాలంటు రాజ్ ని కావ్య అడుగుతుంది. రాజ్ మౌనంగా ఉంటాడు. వెన్నెల వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని కావ్య అనుకుంటుంది. మరొకవైపు రాహుల్ ఆఫీస్ నుండి డైరెక్ట్ గా రుద్రాణి దగ్గరికి వస్తాడు. స్వప్న చేత సంతకం చేయించవా అని రుద్రాణిని రాహుల్ అడుగుతాడు. ప్రొద్దున నుండి ఏం ఇచ్చిన తినట్లేదు తాగట్లేదని రుద్రాణి అంటుంది. అప్పుడే ఆకలిగా ఉందంటూ స్వప్న వస్తుంది. ఇక స్వప్న చూడకముందే జ్యూస్ లో మత్తు మందు కలుపుతుంది రుద్రాణి. ఆ జ్యూస్ స్వప్న తాగుతుంది. ఆ తర్వాత స్వప్న మత్తులోకి వెళ్ళాక తనతో సంతకం చేయించుకోవాలని రాహుల్, రుద్రాణి లు అనుకుంటారు. మరొకవైపు రీ యూనియన్ పార్టీలో భర్తలందరూ ఒకవైపు భార్యలందరూ ఒకవైపు ఉండి కబుర్లు చెప్పుకుంటు ఉంటారు. కావ్య భర్త గురించి గొప్పగా చెప్తుంది. మరొకవైపు రాజ్ భార్యల గురించి గొప్పగా చెప్తుంటాడు.

ఆ తర్వాత కాసేపటికి బాబు ఏడుస్తున్నాడని ఒకావిడ బాబుని తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. పాల బాటిల్ నా దగ్గర ఉందని కావ్య ఇస్తుంది. అంతలోనే ఒక ఆవిడా వచ్చి.. నా బిడ్డ అంటూ రాజ్ చేతిలో నుండి బాబుని తీసుకొని.. నా బిడ్డని నాకు దూరం చేస్తావా అని అడుగుతుంది. నా బిడ్డని నా నుండి దూరం చేసావని ఆవిడ అనగానే.. తనేనా వెన్నెల అని శ్వేతని కావ్య అడుగుతుంది. అంతలోనే ఏంటి రాజ్.. ఎవరో ఒకావిడ వచ్చి బిడ్డని తీసుకుంటే ఇచ్చేస్తావా అంటూ తన క్లాస్ మేట్ రాజ్ ని ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత శ్వేతకి వెన్నెల కాల్ చేస్తుంది. రాజ్ వచ్చాడా అని అడుగుతుంది. రాజ్ వచ్చాడని చెప్తే ఎక్కడ రాకుండా ఉంటుందోనని రాజ్ రాలేదని శ్వేత చెప్తుంది. ఆ తర్వాత రాజ్, వెన్నెల మధ్య సంబంధం నిజమనిపిస్తుంది. ఇప్పుడు వెన్నెల రాజ్ గురించి అడిగిందని కావ్యకి చెప్తుంది శ్వేత. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.