English | Telugu

బిగ్ బాస్ షో.. సెలబ్రిటీలు దొరకడం లేదా?

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. అన్ని సీజన్లకు మంచి రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు సీజన్ 5ను మొదలుపెట్టబోతున్నారు. జూలై నుండి ఈ షో ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు వారికో సమస్య మొదలైంది. అదేంటంటే.. బిగ్ బాస్ షోలో కనిపించడానికి సెలబ్రిటీలెవరూ కూడా ఆసక్తి చూపడంలేదట.

సీజన్ 4లో పేరున్న తారలెవరూ కనిపించలేదనే విమర్శలు వచ్చాయి. అందుకే ఈసారి కాస్త క్రేజ్ ఉన్న వాళ్లను తీసుకురావాలని భావించారు. ఆ విధంగానే 30 మంది సెలబ్రిటీల లిస్ట్ ను సిద్ధం చేశారు. వారిలో 16 మందిని ఫైనల్ చేయాలనుకున్నారు. ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టారు. అయితే వీరిలో చాలా మంది ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నారట. ఈ షో విషయంలో ఉత్సాహం చూపకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఈ షో కోసం తప్పనిసరిగా రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాలి.

దాంతో పాటు మరో వంద రోజులు షో కోసం వెచ్చించాలి. అంటే దాదాపు నాలుగు నెలల వరకు పర్సనల్ లైఫ్‌కి దూరంగా ఉండాలి. షోలో ఉన్నప్పుడు కరోనా వస్తే ఇంకో తలనొప్పి. అందుకే సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ షోపై పెద్దగా ఆసక్తి చూపడం లేదంటున్నారు. అంతేకాదు.. టైటిల్ గెలిచినప్పటికీ సినిమా అవకాశాలు వస్తాయనే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే గతంలో టైటిల్ గెలిచిన వారెవరికీ కూడా సరైన అవకాశాలు రాలేదు. అందుకే ఈ షో వైపు క్రేజ్ ఉన్న వారెవరూ చూడడం లేదు. అంటే ఈసారి కూడా అరకొర సెలబ్రిటీలతో అడ్జస్ట్ అవ్వాలన్నమాట!

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.